Chandra babu: తాడిపత్రిలో ఎస్పీ వాహనంపై దాడి.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్!

తాడిపత్రిలో ఎస్పీ వాహనంపై జరిగిన దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. వైసీపీ హింసా రాజకీయాలకు పరాకాష్ట. జగన్ 5ఏళ్లుగా పెంచి పోషించిన రౌడీ మూకలు ఈరోజు ప్రజల్లో భయం పుట్టిస్తున్నారు. పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందంటూ ట్వీట్ చేశారు.

New Update
Chandra babu: తాడిపత్రిలో ఎస్పీ వాహనంపై దాడి.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్!

Chandra babu: ఎపీలో పలు పోలింగ్ బూతుల వద్ద తీవ్ర ఉద్రిక్త వాతారణం నెలకొంది. వైసీసీ, టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే రక్షణ కల్పించేందుకు రంగంలోకి దిగిన పోలీసులపై దాడులు చేయడం ఆందోళన కలిగిస్తుండగా.. వైసీపీ రౌడీ రాజకీయాలకు ఇది పరాకాష్ట అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra babu) ట్వీట్ చేశారు.

ఈ మేరకు 'నేటి పోలింగ్ లో వైసీపీ హింస ఎంతవరకు వెళ్లిందంటే.. కనీసం పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయింది. తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనం పైనే దాడి చేయడం... తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి పై దాడికి దిగడం, వైసీపీ హింసా రాజకీయాలకు పరాకాష్ట. జగన్ 5ఏళ్లుగా పెంచి పోషించిన రౌడీ మూకలు.. ఈరోజు తమ దాడుల ద్వారా ప్రజల్లో భయం పుట్టించి పోలింగ్ శాతాన్ని తగ్గించడం ద్వారా లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారు. ప్రజలారా.. ఈ కుట్రను మీరే తిప్పికొట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ నిర్భయంగా తరలివచ్చి ఓటు వేయాలి. అత్యధిక ఓటు శాతంతో వైసీపీ హింసా రాజకీయానికి ముగింపు పలకాలి' అంటూ రాసుకొచ్చారు.

Also Read: BREAKING: అంబటి రాంబాబుపై దాడి

Advertisment
Advertisment
తాజా కథనాలు