TDP : ఒక అబద్దాన్ని పదే పదే చెప్పి వైసీపీ లబ్ది పొందాలనుకుంటుంది! ఒక అబద్దాన్ని పదే పదే చెప్పి వైసీపీ లబ్ది పొందాలని చూస్తోందని కమలాపురం టీడీపీ అభ్యర్థి పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. టీడీపీకి ప్రజల్లో మంచి స్పందన ఉంది. కమలాపురం ప్రజలు వైసీపీని విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. By Bhavana 11 May 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి TDP Candidate : ఒక అబద్దాన్ని పదే పదే చెప్పి వైసీపీ(YCP) లబ్ది పొందాలని చూస్తోందని కమలాపురం టీడీపీ(TDP) అభ్యర్థి పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి(Putta Krishna Chaitanya Reddy) అన్నారు. టీడీపీకి ప్రజల్లో మంచి స్పందన ఉంది. కమలాపురం ప్రజలు వైసీపీని విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. పుత్తా కుటుంబం అంటే భయమనే వాతావరణం సృష్టించారు. అలాంటి వారికి ప్రజలే బుద్ది చెబుతారని పుత్తా అన్నారు. అలాంటి ఫ్యామిలీ మాది కాదని... గెలిస్తే పుత్తా ఫ్యామిలీ ప్రజలకు రుణపడి ఉంటుందని కృష్ణ చైతన్య అన్నారు. చెక్కర ఫ్యాక్టరీ లో నట్ లతో సహా అమ్ముకున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని పుత్తా విమర్శంచారు. జె బ్రాండ్ వల్లే పరిశ్రమలు రావడం లేదని ఎద్దేవా చేశారు. ఎవరు అరాచకాలు చేస్తున్నారో ప్రజలు గ్రహించారని పుత్తా అన్నారు. ఫ్లై ఓవర్ నిర్మించాకే ఓటు అడుగుతానన్నారు ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని అడుగుతారు అంటూ ప్రశ్నించారు. వైసీపీ నేత చేపల చెరువును కోనసీమ చేశారు కానీ కమలాపురం ను మాత్రం కాదని విమర్శించారు. మోసపు మాటలు చెప్పి గెలిచారు.వైసీపీలో కీలక నేతలే చేరారు.. కానీ ప్రజలు మావైపే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. Also Read : మాకు మాత్రమే డబ్బులు రాలేదు.. మైలవరంలో ఓటర్ల ఆందోళన (VIDEO) #kadapa #putta-krishna-chaitanya-reddy #ycp #tdp సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి