BSP Chief : బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాండ్ దారుణ హత్యకు గురయ్యారు.పెరంబూర్ లో ఆయన నివాసం వద్ద శుక్రవారం రాత్రి కొందరు కార్యకర్తలతో మాట్లాడుతున్న సమయంలో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద కత్తితో దాడి చేశారు.చికిత్స పొందుతూ ఆయన మరణించారు. By Bhavana 06 Jul 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి K Armstrong : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాండ్ దారుణ హత్యకు గురయ్యారు. చెన్నై పెరంబూర్ లో ఆయన నివాసం వద్ద శుక్రవారం రాత్రి నిల్చుని కొందరు కార్యకర్తలతో ఆయన మాట్లాడుతున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆరుగురు వ్యక్తులు ఆయన మీద కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి పారిపోయారు. వెంటనే ఆయన్ని చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన అక్కడ చికిత్స తీసుకుంటూ చనిపోయారు. ఆయన మీద దాడి చేసే క్రమంలో మరో ఇద్దరు నేతల మీద కూడా దుండగలు దాడికి పాల్పడ్డారు. సెంబియం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అధ్యక్షుడి ఇంటి వద్ద స్థానికంగా ఉన్న సీసీ టీవీ కెమెరాల సాయంతో దర్యాప్తు చేపట్టారు. అయితే ఆర్మ్స్ట్రాంగ్ పై ఇది వరకే పలు కేసులు పెండింగ్ లో ఉన్నట్లు, కొన్ని రౌడీ ముఠాలతో పాత కక్షలు కూడా ఉన్నట్లు సమాచారం. Also Read: ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు! #tamilanadu #murder #bsp #armstrong సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి