Ustaad Bhagat Singh: పవర్ స్టార్ కోసం పవర్ ఫుల్ విలన్

పవర్​ స్టార్​ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్​ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఇందులో పవర్ స్టార్ కు ఆపోజిట్ లో మరో పవర్ ఫుల్ విలన్ ను దర్శకుడు తీసుకురాబోతున్నాడని తెలుస్తోంది. తమిళ డైరెక్టర్, యాక్టర్ పార్తీబన్ ను విలన్ గా చూపించబోతున్నారని టాక్.

New Update
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ కోసం పవర్ ఫుల్ విలన్

Ustaad Bhagat Singh Villain Parthiban: ఉస్తాద్ భగత్ సింగ్...ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో విలన్ ఎవరనేది ఇప్పటి వరకు క్లారిటీ అవ్వలేదు. మూవీ టీమ్​ కూడా ఎటువంటి విషయం కూడా చెప్పలేదు. అయితే తాజాగా ఈ చిత్రం విలన్ ఎవరనేది వివరాలు తెలిశాయి. ఉస్తాద్ భగత్ సింగ్​.. ఒరిజినల్ వెర్షన్ తేరిలో విలన్​ రోల్​ను మహేంద్రన్ చేశారు. అద్భుతంగా నటించారు. గతంలో ఓ సారి ఈ విలన్​ పాత్ర కోసం తనను అడిగారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కూడా చెప్పారు. అయితే ఆ తర్వాత ఈ ప్రతినాయకుడి పాత్ర గురించి ఎటువంటి సమాచారం రాలేదు.అయితే తాజాగా ఆ విలన్​ రోల్​ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పవన్ ను ఎదుర్కొనబోయే విలన్ కూడా పవర్ ఫుల్గా ఉండాలని దర్శకుడు అనుకుంటున్నాడుట. అందుకే తమిళ యాక్టర్​ ఆర్ పార్తీబన్​ ను సెలెక్ట్ చేశారట. కోలీవుడ్​లో డైరెక్టర్​గా యాక్టర్​గా పార్తీబన్ మూడు దశాబ్దాల నుంచి రాణిస్తున్నారు. ఈయన తెలుగులో నటించింది తక్కువే. రామ్ చరణ్ నటించిన రచ్చ చిత్రంలో కనిపించారు. అది కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్​లోని కొన్ని సన్నివేశాల్లో. ఫుల్ లెన్త్ రోల్​ కాదు. అయితే ఇప్పుడీ ఉస్తాద్ భగత్ సింగ్​లో మాత్రం ఎక్కువ స్పేస్ కనిపించనున్నారట. హరీశ్​ శంకర్ ఆయన విలన్​ రోల్​ను ఫుల్​ లెంగ్త్​లో డిజైన్ చేశారట.

ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరగనున్న షూటింగ్ లో పవన్ తో కొన్ని కీలక సీన్స్ ను తెరకెక్కిస్తారని తెలుస్తోంది. దాని తర్వాత పవన్ లేకుండానే షూటింగ్ జరగనుందని టాక్. ఈ సినిమాలో పవన్ (Pawan Kalyan) ను కొత్తగా, పుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్ లో చూపించనున్నారు దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar). ఇక ఈ సినిమాలో శ్రీలీల, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోలీస్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వీలైతే సంక్రాంతి లేదా ఆ తర్వాత సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: నయనానందం…పుట్టినరోజు నాడు పిల్లల ముఖాలు చూపించిన లేడీ సూపర్ స్టార్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bank Merger: మే 1 నుంచి ఏపీలో ఆ బ్యాంకులు కనిపించవ్..

కేంద్ర ప్రభుత్వం 2025 మే 1వ తేదీ నుంచి "ఒకే దేశం – ఒకే ఆర్‌ఆర్‌బీ" విధానాన్ని అమలు చేయనుంది. ఈ నాలుగో దశలో.. దీని కింద 11 రాష్ట్రాల్లో ఉన్న 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు విలీనం కానున్నాయి.

New Update
banks

banks

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ కీలక ప్రకటన చేసింది. నాలుగో విడత బ్యాంకుల విలీనంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 'ఒకే దేశం.. ఒకే ఆర్‌ఆర్‌బీ' ప్రణాళికను త్వరలో అమలులోకి తీసుకురాబోతుంది. దీని వల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏకీకరించి, ఒక్కో రాష్ట్రంలో సింగిల్‌ గ్రామీణ బ్యాంక్‌గా మార్చేయనున్నారు. దీంతో, దేశంలో ప్రస్తుతం ఉన్న 43 ఆర్‌ఆర్‌బీల సంఖ్య 28కి తగ్గనుంది. 2025 మే 1 నుంచి ఈ నాలుగో విడత బ్యాంకుల ఏకీకరణ అమల్లోకి రానుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Also Read: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 4, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో తలో 3, బిహార్, గుజరాత్, జమ్ము అండ్ కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లలో తలో 2 RRB లు ఏకీకరణ కానున్నాయి. ఈ ప్రక్రియ తర్వాత, ఆయా రాష్ట్రాల్లో ఒక్కో గ్రామీణ బ్యాంక్ మాత్రమే ఉండనుందని సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లు ఏకీకరణ అనంతరం 'ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్'గా మారనున్నాయి. మిగతా బ్యాంకుల పేర్లు కనిపించవు. ఈ బ్యాంక్ ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ బ్యాంక్‌గా వ్యవహరిస్తుంది. అదే విధంగా, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోనూ ఒక్కో ఆర్‌ఆర్‌బీ మాత్రమే ఉండబోతుంది.

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

ఈ ఏకీకరణ ద్వారా  ప్రజా ప్రయోజనాలు, గ్రామీణ బ్యాంకుల ప్రయోజనాల దృష్ట్యా రీజనల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్, 1976ను అనుసరించి ఈ ప్రక్రియను అమలు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రస్తుతం 43 ఆర్‌ఆర్‌బీలు 21,856 శాఖలతో 26 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాయి. ఈ బ్యాంకులు 28.3 కోట్ల మంది డిపాజిటర్లు, 2.6 కోట్ల మంది రుణగ్రహీతలకు రుణాలు అందజేస్తున్నాయి. ఏకీకరణతో, ఈ బ్యాంకులు మరింత బలమైన, సమర్థవంతమైన సంస్థలుగా మారి, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సేవలను మెరుగుపరుస్తాయని అధికారులు అనుకుంటున్నారు.

చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తులవారికి రుణాలు అందించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఈ బ్యాంకుల లక్ష్యం. ఒకప్పుడు దేశంలో 196 ఆర్‌ఆర్‌బీలు ఉండగా, 2004-05 నుంచి 2020-21 వరకు మూడు దశల్లో జరిగిన ఏకీకరణల వల్ల ఆ సంఖ్య 43కు తగ్గింది. ప్రస్తుతం చేపడుతున్న నాలుగో దశ ఏకీకరణతో ఈ సంఖ్య 28కి చేరనుంది. ఆర్‌ఆర్‌బీల్లో కేంద్ర ప్రభుత్వం 50 శాతం, స్పాన్సర్ బ్యాంక్ 35 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంది, నాబార్డ్  పర్యవేక్షిస్తుంది.

ఆర్‌ఆర్‌బీలు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను అందించడంతో పాటు, MGNREGA కార్మికుల వేతనాల చెల్లింపు, పెన్షన్ పంపిణీ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తాయి. అంతేకాకుండా, లాకర్ సౌకర్యాలు, డెబిట్-క్రెడిట్ కార్డులు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI సేవలను కూడా అందిస్తాయి. ఏకీకరణతో, ఈ సేవలు మరింత సమర్థవంతంగా, విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Also Read: Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది

Also Read: Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

banks | merge | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment