KTR : కాంగ్రెస్ మైనార్టీలపై పగ పట్టింది: కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు బుల్డోజర్ తో మైనార్టీ ఆస్తులను, హక్కులను హరిస్తుంటే, రేవంత్ రెడ్డి అదే బుల్డోజర్ పద్ధతిలో మైనార్టీలపైన ప్రతీకారం తీర్చుకుంటున్నారన్నారు.
KTR : పరిపాలనమీద పెట్టిన దృష్టి పార్టీ మీద పెట్టలేదు
పరిపాలన మీద పెట్టిన దృష్ఠి పార్టీ కార్యక్రమాల మీదా పెట్టకపోవడం వల్లే ఎన్నికల్లో ఓటమిపాలయ్యామని కేటీఆర్ వెల్లడించారు.
BRS Party : తెలంగాణ భవన్లో దొంగలు.. బీఆర్ఎస్ నేత జేబులో నుంచి రూ.12 వేలు లూటీ!
తెలంగాణ భవన్లో దొంగలు తమ చేతి వాటాన్ని చూపిస్తున్నారు. నిన్న తెలంగాణ భవన్లో జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశానికి వచ్చిన భద్రాచలం MLA తెల్లం వెంకట రావు జేబు నుంచి రూ.12 వేలు ఖాజేశారు. అలాగే ఓ కార్యకర్త నుంచి రూ.42వేలు చోరీ చేశారు.
TS Government : బీఆర్ఎస్ కు రేవంత్ సర్కార్ షాక్.. తెలంగాణ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు!
బీఆర్ఎస్ తమ పార్టీ ఆఫీసులో 'T న్యూస్' ఛానల్ ద్వారా వ్యాపారం చేస్తుందనే కాంగ్రెస్ ఆరోపణలపై రెవెన్యూ అధికారులు స్పందించారు. బీఆర్ఎస్ భవన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి దీనిపై వివరణ ఇవ్వాలని, అలాగే ఎప్పటిలోగా ఛానల్ షిప్ట్ చేస్తారో స్పష్టతనివ్వాలంటూ నోటీసులు పంపించారు.
Telangana: ఢిల్లీలో తెలంగాణ భవన్.. అధికారులతో సీఎం కీలక సమీక్ష..
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్ను నిర్మించేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ భవన్ను నిర్మించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం. అలాగే, ఉమ్మడి ఆస్తుల విభజనపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.
/rtv/media/media_files/2024/12/20/sLBwe4XqEL3EvO5mXnYl.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/KTR-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ktr-meet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/TELANGANA-BHAVAN-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-84-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-Revanth-Reddy-9-jpg.webp)