కార్మికులు రాజ్భవన్ను ముట్టడిస్తారా? ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేస్తారా? ఏం జరగబోతోంది?
టీఎస్ఆర్టీసీ చట్ట సవరణ ముసాయిదా బిల్లు–2023పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. న్యాయనిపుణులు సలహా తీసుకున్న తర్వాతే బిల్లుపై ఓ నిర్ణయం తీసుకుంటామని ముందుగా చెప్పిన తమిళిసై(tamilisai) ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గినట్టే కనిపిస్తున్నారు. ఈ బిల్లుపై ప్రభుత్వం నుంచి మరిన్ని వివరణలు అడిగారు. వాటికి ప్రభుత్వం తక్షణమే సమాధానం చెబితే బిల్లుపై త్వరగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు గవర్నర్ తీరుకు నిరసన ఇవాళ(ఆగస్టు 5) రాజ్భవన్ని ముట్టడిస్తామని ఆర్టీసీ కార్మిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
అక్బరుద్దీన్ ముసలోడివి అయ్యావు.. మంత్రి కేటీఆర్ సెటైర్లు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సరదాగా జరుగుతున్నాయి. ఈసారి నేతల మధ్య వాడివేడి విమర్శలు లేవు. రెండో రోజు సమావేశంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య ఓ ఫన్నీ ఇన్సిడెంట్ సభలో నవ్వులు పూయించింది.
మీరు బీజేపీ ఎమ్మెల్యే కాదంటూ..రాజాసింగ్ కు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్!
అసెంబ్లీలో సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. మీరు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు.. మీరు ఈ విషయాన్ని మర్చిపోయినట్టు ఉన్నారని కేటీఆర్ సెటైర్. ఏడాది గడిచిపోయినా సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో తీవ్ర నిరాశలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం..ఈ మధ్యే మంత్రి హరీశ్ రావును కలిసిన రాజాసింగ్...
ఇంత కంటే అవమానం ఇంకోటి లేదు.. శాసన సభలో బీజేపీకి రూమే లేదు : ఈటల
BJP MLA Etela Rajender Fires on CM KCR | ఇంత కంటే అవమానం ఇంకోటి లేదు.. శాసన సభలో బీజేపీకి రూమే లేదు, ఇలాంటి నిబంధన శాసన సభకె అవమానం : ఈటల
3 రోజులు ఏం సరిపోతాయి? అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రతిపక్షాల గుర్రు
ఈ దఫా నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపి అధికార బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. కేవలం మూడు రోజుల పాటే ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్..!!
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలతో సిద్ధమయ్యాయి. ప్రతిపక్షాల ఎత్తుకు పైఎత్తులతో అధికారపార్టీ రెడీ అవుతోంది. మొత్తానికి ఈ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది.
ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, పలు కీలక అంశాలపై చర్చ
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని నెలల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇవే చివరి కీలక సుదీర్ఘ సమావేశం కావడంతో అధికార ప్రతిపక్ష నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో అసెంబ్లీ దద్దరిల్లనుంది. ప్రతిపక్ష నేతల మాటల తూటాలను సీఎం సైతం ఎదుర్కొనేందుకు అన్నివిధాలుగా సన్నద్ధం అయ్యారు. ఈనెల సోమవారం (31-07-2023) రోజున కేబినేట్ భేటీ కానుంది. ఇక వరదలు, మెడికల్ కాలేజీలకు సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించనున్నారు. ఇవే ప్రధాన అస్త్రాలుగా ప్రతిపక్షనేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇరుకున పెట్టేందుకు సన్నద్దమయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/tamilisai-kcr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ts-assemblyfet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rtc-strike-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ktr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/raja-singh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/eetela-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ts-assembly-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/TS-Assembly-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Untitled-design-61.png)