BIG BREAKING: తమిళిసై సౌందరరాజన్ అరెస్టు..
తమిళనాడులో త్రిభాషా వివాదం ముదురుతోంది. ఈ విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ పార్టీ నేతలను అడ్డుకున్నారు. బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ను అరెస్టు చేశారు.
తమిళనాడులో త్రిభాషా వివాదం ముదురుతోంది. ఈ విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ పార్టీ నేతలను అడ్డుకున్నారు. బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ను అరెస్టు చేశారు.
డీఎంకేకు చెందిన ఓ కౌన్సిలర్ రెచ్చిపోయాడు. ఇటీవల ఆ పార్టీ కార్యకర్తలతో హిందీ వ్యతిరేక ప్రతిజ్ఞలు చేయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ జాకీర్ హుసేన్ ఒళ్లు మరిచి ప్రవర్తించాడు. సుశీల అనే ఓ మహిళా కార్యకర్త చేతికున్న గాజును లాగేందుకు ప్రయత్నించాడు.
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఓ చర్చిలో ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తుండగా.. కరెంట్ షాక్తో నలుగురు యువకులు మృతి చెందారు. పనుల్లో భాగంగా ఇనుప నిచ్చెనను తీసుకెళ్తుండగా అది హైవోల్టేజీ వైర్లకు తగలడంతో ఈ ఘటన జరిగింది.
తమిళనాడులోని ఓ ఆలయంలో పూజా కార్యక్రమం కోసం వినియోగించిన ఒక నిమ్మకాయను వేలం పాట వేశారు. దాన్ని ఓ భక్తుడు రూ.13 వేలకు దక్కించుకున్నాడు. నిమ్మకాయ కోసం ప్రతి ఏడాది వేలం వేసే ఆచారం కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
ఈశా ఫౌండేషన్ అక్రమ నిర్మాణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారించింది. ఈశా ఫౌండేషన్పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డుకు ఆదేశించింది.
ధోనీ చెన్నై టీమ్ను గెలిపించినట్లు తాను వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీని గెలిపిస్తానని ప్రశాంత్ కిషోర్ అన్నారు. విజయ్ పార్టీని గెలిపిస్తే తమిళనాడులో ధోని కన్నా తనకే ఎక్కువ పాపులారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు.
తమిళ భాష ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనదని అమిత్ షా అన్నారు. ఇలాంటి గొప్ప భాషలో మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని తమిళ ప్రజలకు కోరారు. కోయంబత్తూర్లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2026లో తమిళనాడులో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.
తమిళనాడులో డీఎంకే కార్యకర్తలు పలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్ల రంగం పూయడం దుమారం రేపుంతోంది. దీనిపై స్పందించిన బీజేపీ చీఫ్ అన్నమలై డీఎంకేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.