Mumbai Rains: ముంబై నగరాన్ని ముంచెత్తిన వాన
మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వాన ముంబై నగరాన్ని ముంచెత్తుతోంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు, ఉద్యోగులకు రెండు రోజులు సెలవును ప్రకటించింది.
మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వాన ముంబై నగరాన్ని ముంచెత్తుతోంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు, ఉద్యోగులకు రెండు రోజులు సెలవును ప్రకటించింది.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం ఇన్ ఫ్లో లక్షా 80 వేల 686 క్యూసెక్కులు గా కొనసాగుతుంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం 72 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారి తెలిపారు.
గుజరాత్లో మూడంతస్తు బిల్డింగ్ ఉన్నదాటున కూలిపోయింది గత కొద్ది రోజులుగా అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలూ నిండిపోయాయి. దీంతో చాలా ఇళ్ళు నీటిలో మునిగిపోయాయి.
దేశ వ్యాప్తంగా రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణశాఖ మంగళవారం గుజరాత్, మహారాష్ట్ర, గోవాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. మరో ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది.
గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద కొనసాగుతుంది.
ఏపీని వరుణుడు విడిచిపోను అంటున్నాడు. అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో మంగళవారం కూడా ఏపీలో పలుచోట్ల వర్షం పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
గత కొద్ది రోజులుగా ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒడిశా పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ ఉదయం 8.30 ఒడిశాను అనుకొని ఛత్తీస్గడ్ మీదుగా కొనసాగుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా యంత్రాంగం సహాయ పునరావాస చర్యల్లో నిమగ్నమై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.