Live Updates🔴: ముగిసిన పోలింగ్.. క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం!
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసే ఛాన్స్ ఇంకా ఉంది. సాయంత్రం 5గంటలు దాటిన తర్వాత కొత్తగా బూత్ లకు వస్తున్నవారిని అనుమతించడంలేదు పోలీసులు.
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసే ఛాన్స్ ఇంకా ఉంది. సాయంత్రం 5గంటలు దాటిన తర్వాత కొత్తగా బూత్ లకు వస్తున్నవారిని అనుమతించడంలేదు పోలీసులు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ అగ్రనేతలు ఈ సారి తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. రాహుల్ గాంధీ 23, ప్రియాంక 26, మల్లికార్జున్ ఖర్గే 10 సభల్లో పాల్గొన్నారు.
బీజేపీకి రోజు రోజుకు ఆదరణ పెరిగింది.. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. మజ్లిస్ పార్టీని పెంచి పోషింది కాంగ్రెస్సే అని ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. అవినీతి పార్టీలు ఓడిపోవాలని పేర్కొన్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు ఎమ్మెల్సీ కవిత. ఎన్నికలు రాగానే రాహుల్ వస్తాడు ఆ తరువాత రాడు అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కావాలా?.. కరెంట్ కావాలా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్యాహ్నం 1 గంటకు ఆందోల్ విజయభేరి సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. 6 గ్యారంటీలను చట్టంలాగే అమలు చేస్తామన్నారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం రాత్రి హైదరాబాద్ అశోక్ నగర్ లో ప్రత్యక్షమయ్యారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ను వివరించారు.
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. దేశంలో గత పదేండ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా వుందా..? అంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
ఇటీవల రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీని పనౌటి, జైబ్కత్రా (జేబుదొంగ)తో పోల్చడంతో బీజేపీ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఈసీఐ రాహుల్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే నవంబర్ 25న ఎన్నికల కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన పనౌతి(Bad Luck) వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్ అయ్యింది. రాహుల్ కామెంట్స్ను ఖండిస్తూ, 'పనౌతి' చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది.