Siddipet: వెరైటీ దొంగ...ఏకంగా బస్సునే కొట్టేశాడు
దోచుకోవడానికి ఏం దొరకలేదనుకుంటాను ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్ళాడో దొంగ. డ్రైవర్ గా మారి...ప్యాసింజర్స్ ను ఎక్కించుకుని వెళ్ళాడు. దారి మధ్యలో డీజిల్ అయిపోవడంతో బస్సును అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు.
దోచుకోవడానికి ఏం దొరకలేదనుకుంటాను ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్ళాడో దొంగ. డ్రైవర్ గా మారి...ప్యాసింజర్స్ ను ఎక్కించుకుని వెళ్ళాడు. దారి మధ్యలో డీజిల్ అయిపోవడంతో బస్సును అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాకతీయ యూనివర్సిటీ వీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్డీ అడ్మిషన్ విషయంలో మెరిట్పై మాట్లాడటానికి వెళ్లిన విద్యార్థి నేతలపై పోలీసులు దాడి చేయడం ఎంటన్నారు. వర్సిటీ వీసీ విద్యార్థులను కొట్టించారని ఈటల రాజేందర్ ఆరోపించారు.
సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఒకరు బెదిరింపు కాల్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఎంపీకి నిందితుడు మొబైల్ నుంచి ఫోన్ కాల్ చేసినట్టు పోలీసులు తెలిపారు. దీంతో అతని నంబర్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేసి అతన్ని అరెస్టు చేశామన్నారు.
అనంతపురంలోని తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలోని జూనియర్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో గత వారం రోజులుగా ఉద్రిక్తత కొనసాగుతోంది. తాజాగా దీనిపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. దీంతో ఈ వివాదం మరింత వేడెక్కింది. ఈ వ్యవహారంపై జేసీకి పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసు తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రహరీ గోడ నిర్మాణ పనులు ఆపాలని తాను ఎక్కడా అనడం లేదన్నారు.
ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మహిళా నాయకురాలిని పోలీసులు ఈడ్చుకెళ్లడం ఎంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం కొనసాగుతోందని మండిపడ్డారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా మహేశ్వర్ రెడ్డి గత వారం రోజులుగా ఆమరణ నిరాహర దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.
హైదరాబాద్ నగరం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. గోల్గొండ కోటలో జరుగనున్న ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పోలీసులు ఇప్పటికే పూర్తి చేశారు.
వైసీపీ నేతలు అండ చూసుకుని ఏపీ పోలీసులు రెచ్చిపోతున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల అండతో ఏపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమాలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో పుంగనూరు రాజకీయ వేడి కొనసాగతూనే ఉంది. తాజాగా దీనిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్పందించారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. పోలీసుల వల్లే పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొందన్నారు. రోడ్డుకు లారీని అడ్డుగా పెట్టిన వారిపై పోలీసులు కేసులు ఎందుకు పెట్టలేదన్నారు. లారీని తీయడానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జి చేశారని మండిపడ్డారు.