NEET 2024 : ఆగస్టు మధ్యలో నీట్ పీజీ పరీక్ష?
వాయిదా పడ్డ నీట్–పీజీ పరీక్షను ఆగస్టు మధ్యలో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అలాగే.. ఈ పరీక్ష ప్రశ్నపత్రాన్ని కూడా ఎగ్జామ్ నిర్వహించడానికి రెండు గంటల ముందు రూపొందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
వాయిదా పడ్డ నీట్–పీజీ పరీక్షను ఆగస్టు మధ్యలో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అలాగే.. ఈ పరీక్ష ప్రశ్నపత్రాన్ని కూడా ఎగ్జామ్ నిర్వహించడానికి రెండు గంటల ముందు రూపొందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
పేపర్ లీకేజీలను నిరసిస్తూ జులై 4న దేశ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ వంటి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్కు అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరాయి.
వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ పరీక్ష సవరించిన ర్యాంకుల జాబితాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏన్టీఏ ప్రకటించింది. పరీక్ష ఆలస్యమైనందుకు గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు జూన్ 23 న మళ్లీ టెస్ట్ నిర్వహించిన ఎన్టీఏ, వాటి ఫలితాలను విడుదల చేసింది.
పరీక్ష జరిగిన ఒకరోజు తర్వాత రద్దు అయిన యూజీసీ నెట్ ఎగ్జామ్ కొత్త షెడ్యూల్ను రిలీజ్ చేసింది ఎన్టీయే. ఆగస్టు 21, సెప్టెంబర్ 4 ల మధ్యలో జరుగుతుందని ప్రకటించింది. అలాగే సీఎస్ఐఆర్టీ ఎగ్జామ్ జులై 25, 27 మధ్యన నిర్వహించనున్నారు.
లోక్ సభలో నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. ఇది లక్షల మంది యువత భవిష్యత్పై ఆధారపడి ఉందని అన్నారు. ప్రధాని మోదీ కూడా చర్చలో పాల్గొనాలని కోరారు. కాగా పేపర్ లీక్పై సభలో చర్చ జరగాలని కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
రోజురోజుకూ నీట్ పేపర్ లీక్ వెనుక ఉన్న స్కామ్లో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా 700 మంది విద్యార్ధులు, 200-300 కోట్లు లక్ష్యంగా నీట్ రాకెట్ జరిగిందని చెబుతున్నారు. పేపర్ లీక్ వెనుక పెద్ద మాఫియా, గ్యాంగ్ ఉందని చెబుతున్నారు ఇందులో కీల సభ్యుడు అయిన బిజేందర్ గుప్తా.
జూన్ 25 నుంచి 27 వరకు జరగాల్సిన సీఎస్ఐఆర్ యజీసీ నెట్ పరీక్ష వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల ఈ పరీక్షను పోస్ట్పోన్ చేస్తున్నామని ఎన్టీయే తెలిపింది.
నీట్ పరీక్షల్లో అవకతవకల తర్వాత UGC-NET పరీక్షను NTA రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2017లో NTA పుట్టుక నుంచే ఈ ఏజెన్సీ వివాదాలతోనే సావాసం చేస్తోంది. దీంతో దీనికి నో ట్రస్ట్ ఏజెన్సీ అంటూ కొత్త పేరును పెట్టారు అభ్యర్థులు!
నీట్ పేపర్ లీక్పై దేశవ్యాప్తంగా దుమారం రేపుతుండగా.. అనురాగ్ యాదవ్ తనకు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చెప్పడం సంచలనం రేపింది. తన అంకుల్ ఇచ్చిన పేపర్.. పరీక్షలో వచ్చిన పేపర్ మ్యాచ్ అయ్యిందని తెలిపాడు. అయినప్పటికీ అతడికి 720 మార్కులకు185 మార్కులే రావడం గమనార్హం.