PM Modi: పీఎం కిసాన్ నిధులు విడుదల..
కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కోసం అందిస్తున్న పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. తమిళనాడులోని కొయంబత్తూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీటిని ప్రధాని మోదీ విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కోసం అందిస్తున్న పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. తమిళనాడులోని కొయంబత్తూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీటిని ప్రధాని మోదీ విడుదల చేశారు.
శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద తాజాగా అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న ఒక మహిళా భక్తురాలు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి మృతి చెందారు. సరైన ఏర్పాట్లు చేయడంలో ఆలయ నిర్వహణ విఫలమైందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ గుజరాత్లోని సబర్మతి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతడి తమ్ముడు మరో గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ను అమెరికా బహిష్కరించింది. దీంతో అతడిని తాజాగా భారత్కు తీసుకొచ్చారు.
ఆత్మాహుతి దాడి గురించి ఉమర్ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఇస్లాంలో ఆత్మహత్య, అమాయకులను చంపడం రెండూ ఘోరమైన పాపమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు X వేదికగా పోస్టు పెట్టారు.
తమిళనాడు కన్యాకుమారి జిల్లా అరుమనై సమీపంలోని పున్నియంలో దారుణం చోటుచేసుకుంది. బిందు(34) ఈమె భర్త పేరు జయకుమార్. భర్య మరణాంతరం మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అతనితో కూడా ఓ పాప పుట్టాక వారికి మనస్పర్థలు వచ్చాయి. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించకపోవడంపై జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ తొలిసారి స్పందించారు. నిజాయతీగా ప్రయత్నించినప్పటికీ ఫైయిల్ అయ్యానని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
కాన్పూర్లో భారీ బస్సు ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుండి వస్తున్న స్లీపర్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు పిల్లలు సహా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 5 ఏళ్ల చిన్నారితో సహా ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు.
గత వారం ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ హిడ్మా తల్లి మద్వి పుంజీని కలిశారు. హిడ్మా తల్లి మద్వి పుంజీతో ఓ వీడియో రికార్డ్ చేయించారు. అందులో ఆమె తన కొడుకుతో, "నువ్వు ఎక్కడ ఉన్నావు కొడకా? ఇంటికి తిరిగి రా. లొంగిపో" అని చెప్పింది.
ఢిల్లీ పేలుడుకు సంబంధించి ఒక ప్రధాన విషయం వెల్లడైంది. పేలుడుకు 18 గంటల ముందు ఉగ్రవాది ఉమర్ ఎక్కడ ఉన్నాడనే ఆచూకీ లభ్యమైంది. అంతేకాకుండా, ఉగ్రవాది ఉమర్తో కలిసి ఒక ATM సెక్యూరిటీ గార్డు కారులో 20 నిమిషాల పాటు నగరంలో తిరిగాడని వెల్లడైంది.