Andhra Pradesh : నేటి నుంచే వైసీపీ ఎన్నికల శంఖారావం
ఆంధ్రాలో ఎన్నికల ప్రచారానికి వైసీపీ తెర తీసింది. ఈరోజు నుంచే ఆ పార్టీ ఎన్నికల శంఖారావం మోగనుంది. కడపలోని ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది.
ఆంధ్రాలో ఎన్నికల ప్రచారానికి వైసీపీ తెర తీసింది. ఈరోజు నుంచే ఆ పార్టీ ఎన్నికల శంఖారావం మోగనుంది. కడపలోని ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది.
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చెర్లోపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకును కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కేడే ఇద్దరు మృతి చెందారు. పెండ్లి పత్రికలు పంచడానికి వెళ్ళుతుండగా ఈ విషాద ఘటన జరిగింది. మృతులు నడింపల్లెకు చెందిన రామచంద్రారెడ్డి, వెంకట సుబ్బారెడ్డిగా గుర్తించారు.
ఉమ్మడి కడప జిల్లాలో సుబ్బారావు అనే చేనేత కార్మికుడు భార్యాబిడ్డలతో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. సుబ్బారావు కుటుంబం మరణించడం సందేహాలకు తావిస్తోందన్నారు. వైసీపీ నేతల భూ దందాలకు పేదలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. తల్లికూతుర్లు ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటే .. ఇంటి యజమాని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
కడప జిల్లా రామాపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మపై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉత్తా నరసింహారెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. తన అనుచరవర్గంతో వైసీపీలో చేరేందుకు సాయినాథశర్మ ప్రయాత్నాలు చేయడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
ఏపీ జమ్మలమడుగులో హై టెన్షన్ వాతారణం నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడులు చేసుకున్నారు. కుర్చీలతో కొట్టుకున్నారు. శశిధర్ రెడ్డి టీడీపీలో చేరడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గం శశి చేరికను అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది.
కడప జిల్లా ప్రొద్దుటూరులో జనసేన, టీడీపీ మధ్య పొత్తుల వార్ నడుస్తోంది. తానే అభ్యర్థినంటూ కడప, ప్రొద్దుటూరులో టీడీపీ నేతల పోస్టర్స్ దర్శనిమిస్తున్నాయి. పొత్తులు తేలక ముందే అభ్యర్థిత్వం గురించి పోస్టర్స్ వేయడాన్ని జనసైనికులు తప్పుబడుతున్నారు.
ఏపీ రాజకీయాలు మంచి రసవత్తరంగా మారుతున్నాయి. ఒకవైపు టీడీపీ, జనసేన మరో వైపు వైసీపీ, కాంగ్రెస్ లతో...రోజుకో ట్విస్ట్తో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అన్నాచెల్లెళ్ళ మధ్య వార్ ముదురుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏపీ పీసీసీ ఛీఫ్ షర్మిలతో వివేకా కూతురు సునీత భేటీ హాట్ టాపిక్గా మారింది.