IPL 2024: ఐపీఎల్ ఆక్షన్ తర్వాత ఏ ఏ జట్లు ఎలా ఉన్నాయంటే?
డిసెంబర్ 19న దుబాయ్లో ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేయర్ వేలం తర్వాత మొత్తం 10 జట్లు ఎలా కనిపిస్తున్నాయి? మొత్తం అన్ని జట్ల పూర్తి వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
డిసెంబర్ 19న దుబాయ్లో ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేయర్ వేలం తర్వాత మొత్తం 10 జట్లు ఎలా కనిపిస్తున్నాయి? మొత్తం అన్ని జట్ల పూర్తి వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
ఐపీఎల్-2024 ఆక్షన్లో పలువురు స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు. ఈ లిస్ట్లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు స్టీవెన్ స్మిత్ (బేస్ ధర రూ. 2 కోట్లు), జోష్ హేజిల్వుడ్ ఉన్నారు. అటు కివీస్ స్టార్ జేమ్స్ నీషమ్ కూడా అన్సోల్డ్ అయ్యాడు.
ఐపీఎల్ 2024 వేలంలో భారత యంగ్ ప్లేయర్స్ కు కోట్ల వర్షం కురిసింది. ఎలాంటి ఆంచనాలు లేని..కొత్త ఆటగాళ్ళను కూడా కోట్లు పెట్టి కొనుక్కున్నాయి ఫ్రాంఛైజీలు.ఇందులో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి మాత్రం రాబిన్ మింజ్. ఈ కొత్త కుర్రాడు ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఐపీఎల్ అవుతున్నాడు.
ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్లో ఒకటైన ముంబై ఇండియన్స్కు 5 ట్రోఫీలు అందించాడు రోహిత్ శర్మ. అయితే వచ్చే సీజన్ కోసం ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ను ప్రకటించింది. హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ అప్పగించింది.
మల్లికా సాగర్...ఇప్పుడు ఈమె పేరు వైరల్ అవుతోంది. డబ్ల్యైపీఎల్ 2024కు ఆక్షనీర్ గా వ్యవహరిస్తున్న ఈమె గురించి నెట్ లో జనాలు తెగ వెతికేస్తున్నారు. నెక్ట్స్ ఐపీఎల్ కి కూడా మల్లికానే ఆక్షనీర్ గా ఉండే అవకాశం ఉండడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా ఐపీఎల్, హార్దిక్ పాండ్యా...ఇదే టాపిక్ నుడస్తోంది క్రికెట్ ఫీల్డ్ లో. ఐపీఎల్ చరిత్రలో సంచలనంగా మారింది ఆల్ రౌండర్ హార్దిక్ ట్రేడింగ్. కానీ ఇప్పుడదే ముంబై స్టార్ బౌలర్ బుమ్రాను తీవ్ర అసహనానికి గురి చేస్తోందని టాక్.
తనను కెప్టెన్ను చేసిన గుజరాత్ టైటాన్స్ను హార్దిక్ పాండ్యా వదిలేయడంపై అభిమానులు సెటైర్లు పేల్చుతున్నారు. పోకిరిలో మహేశ్బాబు లాగా ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారి టీమ్కి పాండ్యా వెళ్లిపోతున్నాడని కౌంటర్లు వేస్తున్నారు. గతంలో తనకు లైఫ్ ఇచ్చిన ముంబైపైనా పాండ్యా నెగిటివ్ కామెంట్స్ చేశాడు.
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా యువ ఓపెనర్ శుభమన్గిల్ ఎన్నికయ్యాడు. రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా ఉన్న పాండ్యా రిటెన్షన్లో భాగంగా ముంబైకు ట్రేడ్ అయ్యాడు. దీంతో గిల్కు సారధ్య బాధ్యతలు అప్పగించాలని యాజమాన్యం డిసైడ్ అయ్యింది.