Floods: భయపెడుతున్న వర్షాలు.. 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్
దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు భయపెడుతున్నాయి. వరదలు పోటెత్తడంతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు భయపెడుతున్నాయి. వరదలు పోటెత్తడంతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం, బుధవారం భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాలు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. గురువారం మెదక్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది.
పంజాబ్ లో విపరీతంగా కురిసిన వర్షాలకు గురుదాస్ పూర్ లో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయం నీటిలో మునిగిపోయింది. అందులో ఉన్న 400 మంది పిల్లలు, స్కూలు సిబ్బంది వరద నీటిలో చిక్కుకుపోయారు.
జమ్మూకశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భయంకరమైన వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డోడా జిల్లాలో క్లౌడ్బరస్ట్ వల్ల నలుగురు మృతి చెందడం కలకలం రేపింది. కఠువా, కిశ్త్వాడ్లో కూడా వరదలు సంభవించాయి.
రాజస్థాన్లో గత 2రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కోట, బుండి, సవాయి మాధోపూర్, టోంక్ వంటి అనేక జిల్లాల్లో వరద పరిస్థితి నెలకొంది. వరదల కారణంగా ఇద్దరు మహిళలు మృతి చెందగా, వందలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రాజస్థాన్లో కురుస్తున్న భారీ వర్షాలకు చారిత్రక కట్టడాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. జైపూర్ నగరంలోని ప్రఖ్యాత అమెర్ ఫోర్ట్ వద్ద 200 అడుగుల పొడవైన గోడ కూలిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.