AP : రైతులకు పరిహారం ఇవ్వాలి.. తాడేపల్లి గూడెంలో షర్మిల వినూత్న నిరసన..!
పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి వినూత్నంగా నిరసన చేశారు. నందమూరు గ్రామంలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుంలోతు నీళ్లలో దిగి ఆందోళనకు దిగారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి వినూత్నంగా నిరసన చేశారు. నందమూరు గ్రామంలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుంలోతు నీళ్లలో దిగి ఆందోళనకు దిగారు.
భద్రాద్రిలో వరద పోటెత్తింది. ఒక్కసారిగా వర్షపునీరు ముంచెత్తడంతో ఇందులో 28 మంది కూలీలు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఎన్ఢీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని కూలీలను రక్షించారు. తెలంగాణ, ఏపీ నుంచి రెండు హెలికాప్టర్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
శంభు సరిహద్దును వారం రోజుల్లోగా తెరవాలని పంజాబ్-హర్యానాల ఉమ్మడి హైకోర్టు హర్యానా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతులు మళ్ళీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం ఆపేదే లేదని వారు చెబుతున్నారు.
ప్రకాశం జిల్లా బిరదుల నర్వకు చెందిన మిర్చి వ్యాపారి రావి వెంకటరెడ్డి కిడ్నాప్ అయ్యారు. వ్యాపారి రావి గతంలో మిర్చి కొనుగోలు చేసిన డబ్బులు ఎన్నిసార్లు అడిగిన ఇవ్వకపోవడంతో విసుగెత్తిపోయిన గొట్టిపడియ గ్రామ మిర్చి రైతులు వ్యాపారిని కొట్టి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.
రాజధాని పనులు తిరిగి ప్రారంభమైతే తిరుమలకు పాదయాత్రగా వస్తామని గతంలో అమరావతి రైతులు మొక్కుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రాజధాని పనుల్లో కదలిక రావడంతో తిరుమల వెంకటేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, మొక్కు చెల్లించుకోవడానికి రైతులు యాత్ర మొదలు పెట్టారు.
రైతు రుణమాఫీ పై రేవంత్ ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న అప్పును మాఫీ చేయడానికి విధివిధానాలు రెడీ చేస్తుంది రేవంత్ సర్కార్. ఆగస్టు 15వ తేదీలోపు ఈ రుణమాఫీ క్లోజ్ చేయాలని ప్రభుత్వా అధికారులు భావిస్తున్నారు.
కృష్ణా జిల్లా రంగన్నగూడెంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతుల పొలాల్లో పాతిన జగన్ సురక్ష సరిహద్దు రాళ్లను తొలగించి జగన్ ఫోటోతో ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాలను తగలబెట్టారు.
ఏపీ అన్నదాతలకు అదిరిపోయే శుభవార్త. ఏంటో తెలుసా.. మీ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో చాలా మంది రైతులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. రైతుల కోసం ఖరీఫ్ - 2023 కరవు సాయాన్ని ఏపీ ప్రభుత్వం తాజాగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది
రైతు రుణమాఫీ , ధాన్యం కొనుగోళ్ల పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతు రుణమాఫీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సీఎం మీటింగ్ నిర్వహించారు