మహిళా బిల్లు ఓ ఎన్నికల స్టంట్-రాహుల్ గాంధీ
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. జనగణన, డీలిమిటేషన్ అంటూ ఈ బిల్లుకు ముడి పెట్టడం బాలేదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. జనగణన, డీలిమిటేషన్ అంటూ ఈ బిల్లుకు ముడి పెట్టడం బాలేదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి మరో వారం పది రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లు ఈ సింపుల్ స్టెప్స్ తో ఓటర్ల జాబితాలో తమ పేరును చెక్ చేసుకోవచ్చు.
ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు అనే చెప్పొచ్చు. అందుకే అంతటా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. వైసీపీకి చెక్ పెట్టేందుకే ఇప్పుడు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే అయినా టీడీపీ, జనసేన పార్టీల్లో ఈ పొత్తు ఎవరికి ఎక్కువ లాభం అని తెగ చర్చించేసుకుంటున్నారు. క్రితం ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు గెలచుకుని నవ్వులు పాలైన జనసేన ఈసారి అయినా టీడీపీ పొత్తుతో కనీస గౌరవనీయమైన స్థానాలు సంపాదించుకోవచ్చని అనుకుంటోంది.
నాలుగేళ్ళుగా కామ్ గా ఉన్న జగన్ ఒక్కసారిగా జూలు విదిల్చారు. ఇన్నాళ్ళు కేవలం మాటలతో, కేసులతో భయపెట్టారు. కానీ ఇప్పుడు ఏకంగా జైల్లోకి నెట్టారు. ఇలాగే ఒక దాని మీద మరొక కేసు పెట్టి కరెక్ట్ గా ఎన్నికల టైమ్ కి కేసులతో టీడీపీ చతికిలపడేలా చేయాలన్నది వైసీపీ వ్యూహం.
తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఏపీలో ఎన్నికలకు చాలా సమయం ఉంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన కడపలో మహిళా అభ్యర్థిని బరిలోకి దించాలని చూస్తున్నట్లు సమాచారం.
విపక్ష ఇండియా కూటమికి కన్వీనర్ గా కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేను ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. అత్యధికులు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జేడీయూ నేతలు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఇండియా కూటమికి నాయకత్వం వహించే బాధ్యతను కాంగ్రెస్ కు ఇస్తే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ముందస్తు టికెట్ల ప్రకటనతో బీఆర్ఎస్ లో అసమ్మతి జ్వాలలు భగ్గుమన్నాయి. పలు చోట్ల టికెట్ల కేటాయింపులపై అసమ్మతి నేతలు పెదవి విరుస్తున్నారు. టికెట్లు ఇచ్చినా ఆయా నేతలకు తమ నుంచి సరైన సహకారం అందబోదని తెగేసి చెబుతున్నారు. టికెట్ల కేటాయింపులపై పునరాలోచన చేసుకోవాలని, టికెట్లను వెనక్కి తీసుకుని ఇతర నేతలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.