Fake Mysore Sandal Soap : అచ్చు...మైసూర్ శాండల్ సబ్బులాగే....
కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ కేఎస్డీఎల్ ఉత్పత్తి చేస్తున్న మైసూర్ శాండల్ సబ్బులకు నకిలీ సబ్బులను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ కేఎస్డీఎల్ ఉత్పత్తి చేస్తున్న మైసూర్ శాండల్ సబ్బులకు నకిలీ సబ్బులను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నెల 2న గురుగ్రామ్లో హత్యకు గురైన మోడల్ దివ్య పహుజా మృతదేహం లభ్యమైంది. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా తోహానా ప్రాంతంలోని కూడని హెడ్ కెనాల్లో డెడ్బాడీని NDRF కనుగొంది. వీపుపై ఉన్న టాటూ ఆధారంగా మృతదేహం ఆమెదేనని గుర్తించారు. ఈ విషయాన్ని గురుగ్రామ్ పోలీస్ డీసీపీ క్రైం ధృవీకరించారు.
అంబర్ పేటకు చెందిన బబిత యూట్యూబ్ ఛానల్లో పరిచయమైన ఓ జ్యోతిషుడి మాటలు నమ్మి ఆత్మహత్య చేసుకుంది. నీ భర్తకు నువ్వు దూరం అవుతావని చెప్పడంతో ఆందోళనకు గురై తన భర్తకి చెప్పింది. నమ్మొద్దని హెచ్చరించిన మారకపోవడంతో చేయి చేసుకున్నాడు. మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకుంది.
కన్న కొడుకుని దారుణంగా చంపేసిన సుచనా విద్యావంతురాలు. 'ది మైండ్ఫుల్ AI ల్యాబ్' CEO వ్యవస్థాపకురాలైన సుచన భౌతికశాస్త్రంలో మాస్టర్స్ పట్టా పొందారు. ఆస్ట్రోఫిజిక్స్లో నైపుణ్యం సాధించారు. ఇంతటి ఫ్రొఫైల్ కలిగిన సుచన తన కొడుకును ఎందుకు చంపిందో ఆర్టికల్ మొత్తం చదవి తెలుసుకోండి.
'ది మైండ్ఫుల్ ఏఐ' ల్యాబ్ సీఈవో సుచనా సేథ్ కర్ణాటకలోని చిత్రదుర్గలో తన 4ఏళ్ల కుమారుడి మృతదేహాన్ని బ్యాగ్లో తరలిస్తుండగా అరెస్ట్ అయ్యారు. విడిపోయిన భర్తతో కొడుకు కలవకూడదని సుచనా ఈ హత్య చేసినట్టు సమాచారం. గోవాలోని ఓ హోటల్ గదిలో సుచనా చిన్నారిని హత్య చేసింది.
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం నాచుపల్లిలో నిర్వహించిన న్యూఇయర్ వేడుకలు విషాదాంతం అయ్యాయి. రేవంత్ రెడ్డి పాట పెట్టడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో గాయాలపాలైన కాంగ్రెస్ నేత సాదుల రాములు చికిత్స పొందుతూ చనిపోయారు.
న్యూ ఇయర్ కొందరి జీవితాల్లో విషాదం నింపింది. ఊహించని సంఘటనలతో పలువురు ప్రాణాలు కొల్పోగా కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. తెలుగు రాష్ట్రల్లో ఇప్పటికే 20 మందికి పైగా రోడ్డు, తదితర ప్రమాదాల్లో చనిపోయారు. మరికొందరు దారుణంగా గాయపడ్డారు.
82960 09383, 88670 24793 ఈ నంబర్లు గుర్తుపెట్టుకోండి.. ఇల్లు కడుతుండగా బంగారం దొరికిందని, సగం రేటుకే దాన్ని ఇచ్చేస్తున్నామని జనాలకు ఫోన్ చేసి వల వేస్తోంది ఓ బెంగళూరు గ్యాంగ్. జనాన్ని నమ్మించేందుకు కొన్ని ఫొటోలను వాట్సాప్లో కూడా పంపిస్తోంది. నమ్మితే ఇక అంతే సంగతులు..
ఒడిశా కియోంజర్ జిల్లాలోని సరస్పసి గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. తన వ్యవసాయ భూమిలో క్యాలీఫ్లవర్ను చోరీ చేసిందన్న అనుమానంతో ఓ తల్లి(70)ని ఆమె కుమారుడు కొట్టి, విద్యుత్ స్తంభానికి కట్టేశాడు. ఈ గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించిన గ్రామస్థులను శతృఘ్న బెదిరించాడు.