Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల వడబోతకు ఏఐ టెక్నాలజీ!
ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులను కోరింది. వచ్చిన దరఖాస్తుల ను ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వడపోత కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులను కోరింది. వచ్చిన దరఖాస్తుల ను ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వడపోత కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
అసదుద్దీన్ పిలుస్తే డీకే అరుణ ఎంఐఎంలో కూడా చేరవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి. అవకాశవాద రాజకీయాలకు డీకే అరుణ మారుపేరు అని అన్నారు. కాంగ్రెస్ కు డీకే అరుణ వెన్నుపోటు పొడిచిందని.. తల్లి పాలు తాగి రొమ్మును గుద్దే రకం అని మండిపడ్డారు.
విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో మార్పులు తీసుకొచ్చామన్న సీఎం రెండోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామని తిరుపతిలో జరిగిన ఇండియాటూడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో మాట్లాడారు. ఎలాంటి వివక్ష, అవినీతి లేకుండా అర్హత గలవారికి సంక్షేమ పథకాలు అందించామన్నారు.
కాంగ్రెస్ లోనికి వెళ్లే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారురేవంత్ ను కలవడం గురించి అనవసరంగా రాజకీయం చేస్తున్నారని , ఎన్నికల సమయంలో చేసిన హామీలను, వాగ్దానాలను నెరవేర్చాలనే తాము రేవంత్ ను కలిసినట్లు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ నాయకులు ఎంపీ సీట్లను బేరానికి పెడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు బీజేపీ సీనియర్ నేత రఘునందన్రావు. తాము కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నామంటూ కేటీఆర్, హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వారి మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశారు.
కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉన్నారు. ఆయన ఈరోజు అస్సాంలో న్యాయ్ యాత్రను నిర్వహించారు. అయితే దీనిని అక్కడి పోలీసులు అడ్డగించడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ యాత్రకు సిద్ధమయ్యారు. 2003లో తన తండ్రి, దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ముగించిన ఇచ్ఛాపురం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో శ్రీకాకుళం జిల్లా మరో రాజకీయ యాత్రకు సిద్ధమైంది.
ఏపీసీసీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ షర్మిల జనవరి 23 నుంచి జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టి ఇడుపులపాయ వరకు ఆమె పర్యటన చేస్తారని సమాచారం.
తెలంగాణలో ప్రజలకిచ్చే పథకాల్లో ఇంకా మార్పులు చోటు చేసుకోవడం లేదు. ఈనెల కూడా పాత పద్ధతిలోనే ప్రభుత్వ పథకాలను ఇవ్వనున్నారు. అభయహస్తం ఆరు పథకాలు ఇంకా ప్రాసెస్లో ఉండడం వలన ఈ నెలలో కూడా పాత పద్ధతిలో పింఛన్లు తదితర పథకాలు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది.