AP High Court: అమరావతి అసైన్డ్ భూముల కేసు వాయిదా
అమరావతి అసైన్డ్ భూముల కేసుకు సంబంధించి హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈకేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు అందిస్తామని సీఐడీ చెప్పడంతో కోర్టు ఈ విచారణను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.
అమరావతి అసైన్డ్ భూముల కేసుకు సంబంధించి హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈకేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు అందిస్తామని సీఐడీ చెప్పడంతో కోర్టు ఈ విచారణను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు ఏపి హై కోర్టులో విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ కేసు నమోదు చేసింది. గత విచారణలో హైకోర్టు బాబును ఈరోజు వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజమండ్రి జైలులో ఉన్న బాబు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నా.. అధికారులు నిరాకరిస్తున్నారు.
చంద్రబాబు అనారోగ్యం విషయంలో ఏసీబీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు చంద్రబాబుకు ఏసీ సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించింది. దీంతో చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటు చేయనున్నారు రాజమండ్రి జైలు అధికారులు.
చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ వైద్యుల మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు. మెడికల్ రిపోర్ట్ ను బయటపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుంది అంటూ చెప్పుకొచ్చిన జైలు అధికారులు.
టీడీపీ డ్రామాలు పీక్స్ కి చేరాయని మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం క్షీణించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. స్టెరాయిడ్స్ ఇచ్చి చంద్రబాబును చంపాలని చూస్తున్నారని లోకేష్ అవాస్తవాలు చెప్తున్నాడంటూ ధ్వజమెత్తారు. కిడ్నీ ఫెయిల్ అని, బరువు తగ్గారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైలు ఏమైనా అత్తగారి ఇల్లా.. ఏసీ లు పెట్టడానికి..ప్రపంచంలో ఎక్కడా లేని హక్కు చంద్రబాబుకి ఇవ్వాలని దబాయిస్తున్నారంటూ దుయ్యబట్టారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ మాజీ ఎపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ మీద నేడు హైకోర్టులో విచారణకు స్వీకరించింది. 44 మంది ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు సీబీఐ విచారణకు ఇవ్వటానికి అభ్యంతరం లేదని ఏజీ కోర్టుకు కూడా స్పష్టం చేశారు. అనంతరం తరువాత విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ప్రభుత్వం నియమించిన వైద్యులను బెదిరించి తప్పుడు రిపోర్ట్స్ ఇస్తున్నారని టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం వారి మెడ మీద కత్తి పెట్టి తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చేలా చేస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ను ఎయిమ్స్ లో లేదా ప్రవేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించాలని డిమాండ్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేశ్ సంచలన ప్రకటనలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం ప్రమాదంలో ఉందన్నారు. బాబుకు స్టెరాయిడ్స్ ఇచ్చే కుట్ర జరుగుతుందంటూ ఆరోపించారు. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందటూ భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా బరువు తగ్గినట్లయితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్పారని భువనేశ్వరి తెలిపారు. అంతేకాదు జైలులో సౌకర్యాలు సరిగ్గా లేవని..ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని...జైల్లోని పరిస్థితులు తన భర్తకు తీవ్రముప్పు తలపెట్టేలా ఉన్నాయంటూ భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.