YCP : ఏపీలో వైసీపీ గెలిచిన 11 స్థానాలు ఇవే!
175 అసెంబ్లీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని రంగంలోకి దిగిన వైసీపీ కేవలం ఆ పార్టీ 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. పులివెందుల నియోజకవర్గంఓ గతంలో కంటే కూడా జగన్ కు బాగా మెజార్టీ తగ్గింది.
175 అసెంబ్లీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని రంగంలోకి దిగిన వైసీపీ కేవలం ఆ పార్టీ 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. పులివెందుల నియోజకవర్గంఓ గతంలో కంటే కూడా జగన్ కు బాగా మెజార్టీ తగ్గింది.
తిరుమల తిరుపతి టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన కరుణాకర రెడ్డి మంగళవారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆయన గత ఆగస్టులోనే టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి లేఖ పంపించారు.
పవన్ అనూహ్యంగా అత్యధిక మెజార్టీ సాధించి పిఠాపురం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన ప్రత్యర్థి వంగా గీత మీద ఘన విజయాన్ని సాధించారు. దీంతో పవన్ కల్యాణ్ కు సినీ ప్రముఖుల నుండి ,అలాగే రాజకీయ ప్రముఖుల నుండి అభినందనల వెల్లువ మొదలైంది.
ఈసారి ఎన్నికల్లో వైసీపీకి దారుణమైన దెబ్బ తగిలింది. ఎప్పటికీ కోలుకోలేని విధంగా కూటమి వైసీపీ ఓడించింది. కనీసం డిపాజిట్ అయినా దక్కించుకుంటుందా..ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
ఏపీలో స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతున్న టీడీపీ కూటమి విజయం దాదాపు ఖరారైంది. ప్రధాని మోడీ.. చంద్రబాబుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులపై ప్రశంసలు కురిపించారు. టీడీపీ 133, వైసీపీ 15, జనసేన 20, బీజేపీ 7 స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఏపీలో బీజేపీ తొలి విజయం సాధించింది. అనపర్తిలో బీజేపీ MLA అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలుపొందారు. టీడీపీ నేతగా ఉన్న నల్లమిల్లికి ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన కమలం పార్టీ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఏపీలో ప్రస్తుతం బీజేపీ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
జగన్ను ఓడించి చూపిస్తానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు తాను గెలవడమే కాకుండా కూటమి విజయానికి కారణం అయ్యారు. ప్రస్తుతం కూటమి సృష్టిస్తున్న ప్రభుంజనం వెనుక జనసేనానే ఉన్నారన్నది ఎవ్వరూ కాదనలేని నిజం.
ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విశాఖ రుషికొండ ప్యాలెస్పై పార్టీ జెండా ఎగుర వేశారు. కాగా, ఇప్పటి వరకు రుషికొండపై వైసీపీ ప్రభుత్వం ఎవ్వరిని అనుమతించని విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయానికి చేరువలో ఉంది. ఇప్పటికే చాలా ఆధిక్యంలో దూసుకువెళుతున్న కూటమి...ఈసారి అక్కడ గవర్నమెంటు ఏర్పాటు చేయడం ఖాయం అని తెలుస్తోంది. ఏపీలో కూటమి విజయానికి కారణాలు ఏంటి? వైసీపీ ఎందుకు గెలవలేకపోయింది కింది ఆర్టికల్లో చూడండి.