AP : బీచ్ లో ముగ్గురు యువతుల గల్లంతు.. ఇద్దరి మృతి!
ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి బీచ్ లో తీవ్ర విషాదం నెలకొంది.బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు అయ్యారు...వారిలో ఇద్దరు యువతులు చనిపోగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి బీచ్ లో తీవ్ర విషాదం నెలకొంది.బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు అయ్యారు...వారిలో ఇద్దరు యువతులు చనిపోగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఏపీలోని మందు బాబులకు మింగుడుపడని వార్త...రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు మూసివేయనున్నారు. దీనికోసం ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏపీలో సోమవారం నుంచి బుధవారం వరకు మద్యం షాపులను మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేరుపడిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి హైదరాబాద్ను పదేళ్లపాటు ఉమ్మడిగా రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం ప్రకటించింది. ఈ గడువు నిన్నటితో ముగిసింది. ఇకపై హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగనుంది.
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై హైకోర్టు తీర్పు వెలువరించింది. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చిన న్యాయస్థానం.. ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీలు లేకున్నా కౌంటింగ్ నిర్వహించే అర్హత ఉంటుందని ఈసీ ఇచ్చిన వివరణను సమర్ధించింది.
ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. అనంతపురం JNTUలో అధికారులు రిజల్ట్స్ రిలీజ్ చేశారు. పాలిటిక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ సెకండియర్లో ప్రవేశానికి ఈసెట్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో అడ్మిషన్లకు ఐసెట్ నిర్వహిస్తారు.
ఏపీలో జనసేన, టీడీపీ నేతలే టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. జనసేన నాయకుడు కర్రి మహేశ్ కారును తగులబెట్టారు. ఇంటిముందు పార్క్ చేసిన కారుకు నిప్పు పెట్టడం తో మహేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి హైకోర్టు మెట్లెక్కారు.హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. పిన్నెల్లి తనకు కౌంటింగ్ ఉందని పిటిషన్లో పేర్కొన్నారు.
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి దగ్గర కల్వర్టును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికీ గాయాలు అయ్యాయి. చనిపోయిన వారిని నెల్లూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్ సీఐ ఆంజనేయులు యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కోడిపందాల కేసులో ఇరుక్కున్న లక్ష్మణ్ ఫిర్యాదుతో డీఎస్పీ శ్రీ హరి రాజు ఆధ్వర్యంలో ట్రాప్ చేసి పట్టుకున్నారు. వీడియో వైరల్ అవుతోంది.