Andhra Pradesh: ఎసెన్షియా కంపెనీలో ప్రమాదం..16చేరిన మృతుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. మృతుల సంఖ్య 16కు చేరుకుంది.మరోవైపు గాయపడిన వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. మృతుల సంఖ్య 16కు చేరుకుంది.మరోవైపు గాయపడిన వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.
అనకాపల్లిలోని అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. 50మందికి పైగా గాయపడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత జోగి రమేశ్ రెండోసారి పోలీసు విచారణకు హాజరయ్యారు. కానీ రమేశ్ తాము అడిగిన ప్రశ్నలు వేటికీ సమాధానం ఇవ్వడం లేదని డీఎస్పీ మురళీ కృష్ణ చెబుతున్నారు. ఫోన్, సిమ్ కార్డులను కూడా ఇవ్వలేదని తెలిపారు.
పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధుల ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేశారు. మొత్తం 44, 228 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించారు. పదోతరగతి అర్హతతో పడిన ఈ ఉద్యోగాలకు మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేశారు.
సీఎం చంద్రబాబు ఈరోజు ఏపీకి రానున్నారు. ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లిన ఆయన నిన్న ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు, తాజా రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించారు.
AP: మంత్రి లోకేష్ క్షమాపణలు చెప్పారు. ప్రజాదర్బార్లో తాము ఎదుర్కొంటున్న సమస్యపై ఫిర్యాదు చేస్తే.. పరిష్కారం చేయకుండానే చేసినట్లు పరిష్కరించినట్లు మెసేజ్ పంపారని నెటిజెన్ చేసిన ట్వీట్కు లోకేష్ స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు. ఆ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. సభా సంప్రదాయాలను పాటించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సభ్యులు మాట్లాడాలన్నారు.అసెంబ్లీలో ప్రతి అంశంపై చర్చ జరగాలని..అప్పుడే ప్రజలకు అవగాహన వస్తుందని పేర్కొన్నారు.
విజయవాడ నుంచి ఢిల్లీకి ఇండిగో విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి ఈ విమాన సేవలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దీనివల్ల అమరావతి, ఢిల్లీ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుందని అన్నారు.
ఏపీలో వెయిటింగ్లో ఉంటూ హెడ్క్వార్టర్స్లో అందుబాటులో లేని సీనియర్ ఐపీఎస్లకు డీజీపీ ద్వారకా తిరుమల రావు మెమోలు జారీ చేశారు. వారంతా ఉదయం 10 గంటలకు డీజీపీ ఆఫీసుకు వచ్చి సాయంత్రం వరకు అక్కడే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. విధులు ముగిశాక అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాలన్నారు.