Minister Car Accident: కేంద్రమంత్రి కారుకు ప్రమాదం..మంత్రికి ఏమైందంటే!
కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. ఆయన తన పార్లమెంటరీ నియోజకవర్గమైన ఉత్తర్ ప్రదేశ్ లోని పిలిభిత్లో పర్యటనలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. ఆయన తన పార్లమెంటరీ నియోజకవర్గమైన ఉత్తర్ ప్రదేశ్ లోని పిలిభిత్లో పర్యటనలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో బీవీసీ కాలేజీ బస్సు బోల్తా పడింది. స్టీరింగ్ ఫెయిల్ కావడంతో బస్సు పల్టీలు కొట్టడంతో పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన ఉప్పలగుప్తం సరిపల్లి వద్ద జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు బస్సులోనే ఉన్నారు.
యూపీలో ఘోర ప్రమాదం జరిగింది.శుక్రవారం అర్థరాత్రి ఓ ట్రక్కు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసె పై బోల్తా పడింది. ఆ సమయంలో గుడిసెలో ఉన్న కుటుంబం మొత్తం బలైపోయింది. ఈ ప్రమాదంలో 8 నెలల గర్భిణీ కూడా మృతి చెందింది.
మేడ్చల్ జిల్లా దుండిగల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ వద్ద ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి.
మధ్యప్రదేశ్లోని సత్నాలో శనివారం కారు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.కారు సత్నా నుంచి చిత్రకూట్కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టిందని పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆదిత్య నారాయణ్ ధుర్వే తెలిపారు
జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో శనివారం ఓ బస్సు రోడ్డు పై నుంచి జారి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
రైలు నుంచి కిందపడిన భార్యను కాపాడబోయి..భర్త మృతి చెందిన ఘటన డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద జరిగింది.సయ్యద్ ఆసిఫ్, ఆయన భార్య ఆసియాభాను ఫుట్ బోర్డు పై కూర్చుని ప్రయాణం చేస్తున్న క్రమంలో భాను నిద్ర మత్తులో రైలు నుంచి జారి కిందపడింది. ఆమెను రక్షించబోయి సయ్యద్ మృతి చెందాడు.
విజయవాడ పాతబస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. చిట్టూరు కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న కృష్ణా బ్యాంగిల్స్ షాప్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సర్వీస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తోంది.
హిమాచల్ప్రదేశ్లోని సోలన్లో ఓ మహిళ కారును పార్క్ చేసేందుకు ప్రయత్నించింది. దీంతో కారు అదుపుతప్పి 30 అడుగుల ఎత్తు నుంచి గుంతలో పడిపోయింది. తీవ్ర గాయాలపాలైన ఆ మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.