/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-30T155850.762-1-jpg.webp)
T20 World Cup: టీ20 ఆడనున్న భారత జట్టును బీసీసీఐ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. 15 మంది ఆటగాళ్లతో జాబితాను రిలీజ్ చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. బీసీసీఐ సెక్రటరీ, అజిత్ అగార్కర్తో కూడిన సెలక్షన్ ప్యానెల్ వరల్డ్ కప్కు ఆడే బారత జట్టు టీమ్ను ఎంపిక చేసింది. ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ మొదలవనుంది. టీ-20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి మొదలవనుంది. దీనికి అమెరికా, వెస్ట్ ఇండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
ఇక వరల్డ్ కప్లో భారత జట్టు తన మొదటి మ్యాచ్ను జూన్5న ఐర్లాండ్తో ఆడనుంది. ఇక గ్రూప్ ఏ లో ఉన్న ఇండియా-పాక్లు జూన్ 9న తలపడనున్నాయి. ఈ వరల్డ్కప్లో మొత్తం 20 జట్లు పోటీ పడుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 29న జరగనుంది. అమెరికాలో 3, వెస్ట్ఇండియాలో 6 వేదికల్లో మొత్తం 55 మ్యాచ్లు జరగనున్నాయి.
టీ20 ఆడే భారత జట్టు ఇదే...
రోహిత్ (సి), కోహ్లీ, జైస్వాల్, సూర్య, పంత్ (డబ్ల్యుకె), శాంసన్ (డబ్ల్యుకె), హార్దిక్ (విసి), దుబే, జడేజా, అక్షర్, కుల్దీప్, చాహల్, అర్ష్దీప్, బుమ్రా మరియు సిరాజ్.
రిజర్వ్లు - శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్, అవేష్ ఖాన్.
🚨India’s squad for ICC Men’s T20 World Cup 2024 announced 🚨
Let's get ready to cheer for #TeamIndia #T20WorldCup pic.twitter.com/jIxsYeJkYW
— BCCI (@BCCI) April 30, 2024