Swiggy-Zomato: కస్టమర్లకు షాకిచ్చిన స్విగ్గీ, జొమాటో..ఆ ఫీజు 20 శాతం పెంపు!

ఫుడ్‌ డెలివరీ సంస్థలు అయిన స్విగ్గీ, జొమాటోలు కస్టమర్లకు తాజాగా పెద్ద షాకిచ్చాయి. ఢిల్లీ, బెంగళూరు లాంటి అధిక డిమాండ్ ఉన్న నగరాల్లో ప్లాట్‌ఫామ్ ఫీజును ఇకపై 6 రూపాయలు చేసినట్టు వివరించాయి. గతంలో ఈ ఫీజు రూ.5గా ఉండేది.. దీంతో ఫ్లాట్‌ఫామ్ ఫీజు 20 శాతం మేర పెరిగింది.

New Update
Swiggy-Zomato: కస్టమర్లకు షాకిచ్చిన స్విగ్గీ, జొమాటో..ఆ ఫీజు 20 శాతం పెంపు!

Swiggy - Zomato: ఫుడ్‌ డెలివరీ సంస్థలు అయిన స్విగ్గీ, జొమాటోలు కస్టమర్లకు తాజాగా పెద్ద షాకిచ్చాయి. ఢిల్లీ (Delhi), బెంగళూరు (Bengaluru) లాంటి అధిక డిమాండ్ ఉన్న నగరాల్లో ప్లాట్‌ఫామ్ ఫీజును (Platform Fees) ఇకపై 6 రూపాయలు చేసినట్టు వివరించాయి. గతంలో ఈ ఫీజు రూ.5గా ఉండేది.. దీంతో ఫ్లాట్‌ఫామ్ ఫీజు 20 శాతం మేర పెరిగింది. అయితే, బెంగళూరులో ఫీజును స్విగ్గీ తొలుత రూ.7గా నిర్ణయించినా.. ఆ తరువాత రాయితీ ఇచ్చి రూ.6గా ఫిక్స్ ఉంచింది.

అయితే, గతంలో కూడా జొమాటో- స్విగ్గీలు తమ ప్లాట్‌ఫాం ఫీజును ఒకేసారి పెంచాయి. 2023లో ఈ తరహా ఫీజును మొదలు పెట్టాయి. మొదట 2 రూపాయలుగా ఉన్న ఫీజును విడతల వారీగా పెంచుతూ వచ్చాయి. ఏప్రిల్‌లో జొమాటో ఈ ఫీజును 25 శాతం మేర పెంచి 5 రూపాయలగా ఉంచింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, లఖ్‌నవూ నగరాలలో ఈ పెంపును అమల్లోకి తీసుకుని వచ్చింది. మరింత వేగవంతమైన డెలివరీల కోసం ప్రియారిటీ ఫీజు పేరిట ప్రత్యేక రుసుమును కూడా వసూలు చేయబోతుంది.

కాగా, ఒక్కో ఆర్డరపై వచ్చే సగటు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా డెలివరీ యాప్‌లు ఈ తరహా ఫీజులు వసూలు చేస్తున్నాయి. బెంగళూరులో బ్లింకిట్ ఒక్కో ఆర్డర్‌పై 4 రూపాయలు, ఇన్‌స్టా మార్ట్‌ 5 రూపాయలు వసూలు చేస్తుండగా.. ఢిల్లీలో ఈ చార్జీలు వరుసగా రూ.16, రూ.4గా ఉన్నాయి. మరోవైపు, కొన్ని సమయాల్లో ఈ రెండు ప్లాట్‌ఫామ్‌ల సర్ చార్జీలు కూడా వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. టాటా గ్రూపునకు చెందిన బీబీనౌ 99 రూపాయలకు పైన విలువ చేసే ఆర్డర్లపై 5 రూపాయల హ్యాండ్లింగ్ చార్జీలు వసూలు చేస్తుంది.

Also Read: ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం.. పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే అన్ని విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పారు. 

New Update
Renu Desai

Renu desai

తనకు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని..కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణూ దేశాయ్. రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు అదే కోరికని...కానీ తాను విధి రాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు.  సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని...ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని...స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని...అందుకే వారు తాను పోలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వూతూ చెప్పారు రేణూ దేశాయ్. 

మోడీ భక్తురాలిని..బీజేపీకే సపోర్ట్..

తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని...ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులా తాను ఏదైనా పార్టీలో చేరితే కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఆమె కుమారుడు అకీరా నందన్ గురించి చెబుతూ...ఓజీ సినిమాలో అతను పని చేయడం లేదని తెలిపారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు రేణూ ఆరోపించారు. 

today-latest-news-in-telugu | renu-desai | actress | inter-view

Also Read: WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

Advertisment
Advertisment
Advertisment