TS News: ఎర్రటి ఎండలతో ఉడికిపోతున్న తెలంగాణ..43 డిగ్రీల మార్క్ దాటిన ఉష్ణోగ్రత..!

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు భగభగలతో తెలంగాణ జనమంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9కే మండే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్ 1న 43 డిగ్రీల మార్క్ ను దాటాయి ఉష్ణోగ్రతలు.

New Update
TS News: ఎర్రటి ఎండలతో ఉడికిపోతున్న తెలంగాణ..43 డిగ్రీల మార్క్ దాటిన ఉష్ణోగ్రత..!

TS News:  భారీ ఎండలతో తెలంగాణ రాష్ట్రం ఉడికిపోతుంది. భానుడి భగభగలతో జనం అల్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత మార్క్ దాటింది. ఉదయం 9 నుంచే ఉక్కపోత షురూ అయితుంది. ఉదయం 11 దాటిందంటే ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రానున్న రోజు ఐదుర రోజుల పాటు మరింత ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

సోమవారం హైదరాబాద్ లోని ఉప్పల్ లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. 43.3 డిగ్రీల మార్కును దాటింది. మియాపూర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, హయత్ నగర్, శేరిలింగంపల్లి, కాప్రా, ఖైరతాబాద్, కూకట్ పల్లి ఏరియాల్లో 42 డిగ్రీలు దాటింది. ఇక దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. మార్చి నెలల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగితే..మే నెలలో ఎలా ఉంటాయని జనం భయపడుతున్నారు. తాజాగా భారత వాతావరశాఖ చేసిన హెచ్చరికలు మారింత భయాందోళనకు గురిచేస్తుంది.

ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు భారీగా వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంతజయ్‌ మహాపాత్ర తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మధ్య భారతదేశం, ఉత్తర మైదానాలు, దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో రెండు నుంచి ఎనిమిది రోజులు హీట్‌వేవ్స్‌ కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో ప్రభావం ఉంటుందన్నారు. 23 రాష్ట్రాలు వేడిగాలుల కారణంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళికలను చేశామని తెలిపింది ఐఎండీ.

ఇది కూడా చదవండి: భవిష్యత్తులో నో పెట్రోల్ వెహికల్స్..ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ కారు..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: గోరంట్ల మాధవ్ కు ఏప్రిల్ 24 వరకు రిమాండ్

మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇతనితో పాటూ మిగతా ఐదుగురికి కూడా కోర్టు రిమాండ్ విధించింది. మాధవ్‌ తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ వాదనలు వినిపించారు.

author-image
By Manogna alamuru
New Update
ap

Ex MP Gorantla Madhav

నిన్న అరెస్ట్ అయిన వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కు గుంటూరులోని ప్రత్యేక మొబైల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఏప్రిల్ 24 వరకు మాధవ్ కు, మిగతా ఐదుగురికి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు పోలీసులు వారిని నల్లపాడు పీఎస్‌ నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించి  వైద్య పరీక్షలు చేయించారు. మాధవ్‌ తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ వాదనలు వినిపించారు. రిమాండ్‌ తిరస్కరించాలని కోర్టును కోరారు. కోర్టు ఆదేశాల మేరకు మాధవ్ , మిగతా ఐదుగురిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించనున్నారు. 

మళ్ళీ మాధవ్ దురుసు ప్రవర్తన..

కోర్టుకు తీసుకువస్తున్న సమయంలో ఈరోజు గోరంట్ల మాధవ్ మళ్ళీ దురుసుగా ప్రవర్తించారు. మీడియా ముందుకు రావడానికి కూడా నిరాకరించారు ఎంపీగా చేసిన వ్యక్తిని మీడియా ముందు తీసుకువస్తారా అంటూ గొడవ చేశారు.

మాజీ ఎంపీ, వైసీపీ లీడర్ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కిరణ్ చేబ్రోలును పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని గుంటూరు ఎస్పీ ఆఫీస్‌కు తరలించారు. ఎస్పీ ఆఫీస్‌లోనే గోరంట్ల మాధవ్ నానా హంగామా చేశారు. కోపంతో కిరణ్‌పై చేయి చేసుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసుల ముందే కిరణ్‌ను కొట్టాలని చూశాడు. గుంటూరు ఎస్పీ ఆఫీస్‌లో వైసీపీ లీడర్ గోరంట్ల మాధవ్ అనుచరులతో కిరణ్‌పై దాడికి యత్నించాడు. గోరంట్ల మాధవ్ ఎస్కార్ట్ వాహనాన్ని సీజ్ చేసి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.కిరణ్ పై మొత్తం 4 కేసులు పెట్టామని ఎస్పీ సతీష్ తెలిపారు. కిరణ్ గతంలో మాజీ మంత్రి   విడదల రజినిపై కూడా అసభ్యకర పోస్టులు పెట్టాడని ఎస్సీ చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసి ఇబ్రహింపట్నం దగ్గర అతన్ని అరెస్ట్ చేశామని జిల్లా పోలీస్ అధికారి తెలిపారు.

today-latest-news-in-telugu | mp-gorantla-madhav | 14 days remand 

Also Read: బైక్‌పై హిందూ యువకుడు, ముస్లిం యువతి.. నలుగురు యువకులు ఏం చేశారంటే ?

Advertisment
Advertisment
Advertisment