Malla Reddy: మల్లారెడ్డి కోడలుకు విద్యార్థుల కౌంటర్.. అంతా అవినీతే అంటూ క్యాంపస్ లో లొల్లి!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విద్యా సంస్థల్లో వరుస దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ చేసి, మరోసారి ఎగ్జామ్ ఫీజు, ట్యూషన్ ఫీజుల పేరుతో బలవంతంగా డబ్బులు గుంజుతున్నారంటూ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రశ్నిస్తే ప్రీతిరెడ్డి బెదిరింపులకు పాల్పడుతోందని వాపోతున్నారు.

New Update
Malla Reddy: మల్లారెడ్డి కోడలుకు విద్యార్థుల కౌంటర్.. అంతా అవినీతే అంటూ క్యాంపస్ లో లొల్లి!

Preeti Reddy Vs Malla Reddy Students: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి (Malla Reddy) సంబంధించిన విద్యా సంస్థల్లో వరుస దారుణాలు బయటపడుతున్నాయి. కాలేజీ యాజమాన్యానికి, విద్యార్థులకు మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫీజు విషయంలో మొదట ఒకమాట చెప్పి ఆ తర్వత అధిక ఫీజులు వసూల్ చేస్తున్నారంటూ స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కొంతమందిని కావాలనే పరీక్షల్లో ఫెయిల్ చేసి, మరోసారి ఎగ్జామ్ ఫీజు, ట్యూషన్ ఫీజుల పేరుతో బలవంతంగా డబ్బులు గుంజుతున్నారంటూ వాపోతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం మల్లా రెడ్డి కోడలు, ప్రీతిరెడ్డితో విద్యార్థులు వాగ్వాదానికి దిగిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

బౌన్సర్లతో బెదిరింపులు..
ఈ మేరకు క్యాంపస్‌లోకి రాజకీయ నేతలను ఎలా తీసుకొస్తారని విద్యార్థులు ప్రశ్నించగా.. జేఎన్‌టీయూ రూల్స్‌ పాటిస్తున్నామన్న ప్రీతిరెడ్డి చెప్పారు. అలాగే అధిక ఫీజులు, కనీస అవసరాల గురించి వివరణ కోరగా ప్రీతిరెడ్డి దురుసుగా వ్యవహరించారు. ఆమె అసభ్యకర కామెంట్స్‌పై విద్యార్థులు మండిపడ్డారు. అంతేకాదు తమను కావాలనే డిటైన్‌ చేశారని మండిపడ్డారు. వారు డిటైన్‌ చేసిన విద్యార్థుల్లో టాపర్లు ఉన్నారని చెప్పారు. ఈ దుర్మార్గంపై అడగడానికి వెళితే కాలేజ్‌ లోనికి వెళ్లకుండా బౌన్సర్లతో అడ్డుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Warangal: ఐస్ క్రీమ్ లో మూత్రం, వీర్యం.. వరంగల్ లో బయటపడ్డ దారుణం!

కబ్జా చేసి ఎదిగారు..
'మీరు పాలు, పూలు అమ్ముకొని పెద్దోళ్లు కావచ్చు. మేం చదువుకొని పెద్దోళ్లం కావాద్దా..? మీరు కబ్జా చేసి ఎదిగారు.. మేమలా చేయలేము. ఫీజుల విషయంలో చెప్పేది ఓ రేటు.. వసూలు మరోరేటు. హాస్టల్‌లో భోజనం సరిగా ఉండదు. గతంలో 300 మందికి ఫుడ్‌ పాయిజన్‌ అయింది. ఆ విషయం బయటకు రాకుండా మేనేజ్ చేశారు. కాలేజీకి మద్యం తాగి వచ్చారని మమ్మల్ని ఎగతాళి చేశారు. టెన్త్, ఇంటర్ లో టాపర్లను సైతం ఫెయిల్ చేశారు' అంటూ మీడియాతో చెబుతూ వాపోయారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే అన్ని విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పారు. 

New Update
Renu Desai

Renu desai

తనకు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని..కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణూ దేశాయ్. రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు అదే కోరికని...కానీ తాను విధి రాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు.  సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని...ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని...స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని...అందుకే వారు తాను పోలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వూతూ చెప్పారు రేణూ దేశాయ్. 

మోడీ భక్తురాలిని..బీజేపీకే సపోర్ట్..

తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని...ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులా తాను ఏదైనా పార్టీలో చేరితే కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఆమె కుమారుడు అకీరా నందన్ గురించి చెబుతూ...ఓజీ సినిమాలో అతను పని చేయడం లేదని తెలిపారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు రేణూ ఆరోపించారు. 

today-latest-news-in-telugu | renu-desai | actress | inter-view

Also Read: WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

Advertisment
Advertisment
Advertisment