Indore : ప్రాణాలు తీసిన వీడియో కాల్ ప్రాంక్

ఇండోర్‌లో విద్యార్ధి ప్రాంక్ సరదా ప్రాణాలను తీసింది. ఉరి వేసుకుంటున్నట్టు నటించి ఫ్రెండ్స్‌ను ఏప్రిల్ ఫూల్ చేద్దామనుకున్న అతని ప్లాన్ రివర్స్ అయి అతని లైఫ్‌నే ఎండ్ చేసింది.

New Update
Indore : ప్రాణాలు తీసిన వీడియో కాల్ ప్రాంక్

Life Ended With Prank Call : సోషల్ మీడియా(Social Media), రీల్స్, ప్రాంక్స్... వీటికి యువత బాగా అడిక్ట్అయిపోతున్నారు. వీటిలో చాలా మందికి డబ్బులు కూడా వస్తుండడంతో మరింత రెచ్చిపోతున్నారు. అయితే ఈ సరదాలో పడి కొంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇండోర్‌(Indore) లో ఓ విద్యార్ధి ఇలానే ప్రాంక్(Prank Calls) చేయబోయి ఊపిరి వదిలేశాడు.

ఏప్రిల్ ఫూల్ చేద్దామనుకున్నాడు..

రెండు రోజుల క్రితం ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్ డే(Fools Day) అయింది. ఈ రోజున తన ఫ్రెండ్స్‌ను ఫూల్ చేయాలనుకున్నాడు ఇండోర్‌లోని ఓ విద్యార్ధి. అనుకున్నదే తడవుగా ఫ్రెండ్స్‌కు వీడియో కాల్ చేశాడు. ఇవతల తాను ఊరివేసుకుంటున్నట్టు నటించాలని అనుకున్నాడు. కొంతసేపు బిల్డప్ ఇచ్చి ఏప్రిల్ ఫూల్ అని చెబుదామనుకున్నాడు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. వీడియో కాల్‌లో ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుండగా కాళ్ళ కింద ఉన్న స్టూల్ పడిపోయింది. విద్యార్ధి గొంతుకు ఉరి బిగుసుకుపోయింది. దాంతో వీడియో కాల్‌లో ఉండగానే అతని మాట పడిపోయింది. ప్రాణం అనంత లోకాల్లో కలిసిపోయింది.

పదకొండవ తరగతి విద్యార్ధి..

వీడియో కాల్‌(Video Call) లో ఫ్రెండ్ అలా చనిపోవడం చూసి అవతల ఉన్న ఫ్రెండ్స్ ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. వెంటనే అందులో నుంచి తేరుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వాళ్ళు వెళ్ళి విద్యార్ధిని ఆసుపత్రిలో కూడా జాయిన్ చేశారు. అయితే అప్పటికే అతని ప్రాణం పోయింది. మృతుడి పేరు అభిషేక్‌ అని.. పదకొండవ తరగతి చదువుతుననాడని తెలుస్తోంది. ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Delhi : ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ భార్య సునీత?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment