Stock Market News: బడ్జెట్ వేళలో స్టాక్ మార్కెట్ పరుగు.. పడిపోయిన Paytm షేర్లు

మరి కొద్దిసేపట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లాభాలతో ప్రారంభమైంది. Paytm పై ఆర్బీఐ నిబంధనల ప్రభావం పడింది. ఆ షేర్లు దాదాపు 20% పడిపోయాయి. 

New Update
Nifty Boom: నిఫ్టీ తగ్గే ఛాన్సే లేదట.. డిసెంబర్ నాటికి రికార్డ్ స్థాయి గ్యారెంటీ అంటున్న నిపుణులు 

Stock Market News: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈరోజు, గురువారం (ఫిబ్రవరి 1) మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈరోజు భారత స్టాక్ మార్కెట్ ఫ్లాట్ గా ప్రారంభమైంది. అయితే, ట్రేడింగ్ సమయంలో, సెన్సెక్స్ సుమారు 200 పాయింట్ల పెరుగుదలతో 71,947 స్థాయి వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 54 పాయింట్లు లాభపడగా, 21,779 వద్ద ట్రేడవుతోంది.

Paytm షేర్లు దాదాపు 20% పడిపోయాయి
Stock Market News: 30 సెన్సెక్స్ స్టాక్‌లలో, 13 పెరుగుదలను చూస్తున్నాయి.  17 పతనాన్ని చూస్తున్నాయి. RBI చర్యలతో ఈరోజు  Paytm షేర్లు దాదాపు 20% పడిపోయాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) బుధవారం Paytm బ్యాంకింగ్ విభాగం Paytm పేమెంట్స్ బ్యాంక్ (PPBL) కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దనే నిబంధన విధించింది. అది వెంటనే అమలులోకి వచ్చింది.

Also Read: Budget 2024 Live Updates🔴: మధ్యంతర బడ్జెట్‌లో ప్రజలను ఆకర్షించే పథకాలు!

ఫిబ్ర‌వ‌రి 29వ తేదీ త‌ర్వాత ప్ర‌స్తుతం ఉన్న క‌స్ట‌మ‌ర్లు త‌మ ఖాతాల్లో మొత్తాలు జోడించ‌కుండా నిషేధించాల‌ని ఆర్‌బీఐ కంపెనీని ఆదేశించింది. ఈ ఆర్డర్ తర్వాత, Paytm పేమెంట్ బ్యాంక్‌లో క్రెడిట్/డిపాజిట్ లావాదేవీలు ఉండవు.  ఫిబ్రవరి 29 తర్వాత, Paytm పేమెంట్ బ్యాంక్ బ్యాంకింగ్ సేవలను అందించదు.

BLS e-Services IPOలో పెట్టుబడి పెట్టడానికి ఈరోజే చివరి అవకాశం
BLS e-Services Limited యొక్క IPOలో పెట్టుబడి పెట్టడానికి ఈరోజే చివరి అవకాశం. ఈ IPO జనవరి 30న ప్రారంభించబడింది, ఇది ఈరోజు ఫిబ్రవరి 1న ముగుస్తుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ ₹310.91 కోట్లు సమీకరించాలనుకుంటోంది. కంపెనీ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) మరియు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో ఫిబ్రవరి 6న లిస్ట్ చేయబడతాయి.

Watch this interesting Video :

Advertisment
Advertisment
తాజా కథనాలు