Pakistan : అవన్నీ తూచ్.. ఛాంపియన్స్ ట్రోఫీ వల్ల లాభపడ్డాం: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం ద్వారా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీవ్రంగా నష్టపోయిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  అయితే  దీనిపై పీసీబీ స్పందించింది. దాదాపు 10 మిలియన్ డాలర్ల లాభం వచ్చిందని అధికారికంగా వెల్లడించింది.

New Update
icc pcb

ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం ద్వారా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీవ్రంగా నష్టపోయిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  అయితే  దీనిపై పీసీబీ స్పందించింది. దాదాపు 10 మిలియన్ డాలర్ల లాభం వచ్చిందని అధికారికంగా వెల్లడించింది. 10 మిలియన్ డాలర్లు అంటే పాక్‌ రూపాయల్లో రూ. 280 కోట్లు ఆదాయం వచ్చిందన్న మాట.  ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం, కరాచీ, లాహోర్, రావల్పిండిలోని స్టేడియంలను అప్‌గ్రేడ్ చేయడానికి భారీ మొత్తంలో ఖర్చు చేయడం ద్వారా బోర్డు ఆర్థికంగా నష్టపోయిందనే వార్తల నేపథ్యంలో పీసీబీ ప్రతినిధి ఆమిర్ మీర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జావేద్ ముర్తాజా మీడియాకు వెల్లడించారు. 

ఖర్చులను ఐసీసీ భరించింది 

 టోర్నమెంట్ కోసం అన్ని ఖర్చులను ఐసీసీ భరించిందని ఆయన తెలిపారు.  టికెట్ల అమ్మకాలు, ఇతరాలతో పీసీబీకి రూ. 280 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.  ఆడిట్ తర్వాత ఐసీసీ నుంచి తమకు అదనంగా రూ.92 కోట్లు వస్తాయని భావిస్తున్నాం. అయితే తాము అనుకొన్న లక్ష్యాలను ఇప్పటికే అధిగమించామని ముర్తాజా మీడియాకు తెలిపారు.  ప్రభుత్వానికి ట్యాక్స్‌ రూపంలోనే రూ.1.20 కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం ద్వారా పాక్ మూడో ధనిక బోర్డుగా మారనుందని తెలిపారు.  

Also read :  అక్రమ సంబంధం వొద్దన్న తండ్రి.. గుండెలపై గుద్ది చంపిన కూతురు!

2023-24 ఆర్థిక సంవత్సరానికి పీసీబీ మొత్తం ఆదాయం 10 బిలియన్ డాలర్లకు చేరుకుందని  ఇది 2024 సంవత్సరం కంటే 40% పెరుగుదల అని కూడా ఆయన పేర్కొన్నారు. పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ఆర్థిక లక్ష్యాలను సవరించడంలో కీలక పాత్ర పోషించారని, బోర్డు ఆర్థిక పనితీరును మెరుగుపరచడంలో చురుకైన పాత్ర పోషించారని ముర్తాజా తెలిపారు. ఇక ఆటగాళ్ల జీత భత్యాల్లో కోత విధింపు నిర్ణయాన్ని పీసీబీ ఛైర్మన్ వెనక్కి తీసుకున్నారు.  త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ఆర్థికపరమైన అంశాలను అధికారిక వెబ్‌సైట్‌లో పెడతామని ప్రతిది పారదర్శకంగానే ఉంటుందని పీసీబీ చెప్పుకొచ్చింది.  

Also Read :   కర్ణాటకలో హనీట్రాప్‌ దుమారం.. స్పందించిన సీఎం సిద్ధరామయ్య

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

ఐపీఎల్ లో గుజరాత్ ఓటమి అన్నదే లేకుండా ముందుకు సాగిపోతోంది. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ 58 పరుగులతో ఘన విజయం సాధించింది. మరోవైపు హ్యాట్రిక్ పై కన్నేసిన రాజస్థాన్ కు నిరాశ ఎదురైంది. 

New Update
ipl

GT VS RR

గుజరాత్ ఇచ్చిన భారీ లక్ష్యం 217 పరుగులను సాధించడంలో సంజూ శాంసన్ టీమ్ తడబడింది.  దీంతో గుజరాత్ ఓటమన్నదే లేకుండా వరుసగా నాలుగో విజయ దక్కినట్టయింది. 58 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చిత్తుగా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది.  దీంతో 218 పరుగులతో ఆర్ఆర్ లక్ష్య ఛేదనకు దిగింది. కానీ 19.2 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయిపోయింది. హెట్ మయర్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సెక్స్లతో హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ సంజూ శాంసన్ కూడా 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 41 పరుగులు బాదాడు. రియాన్ పరాగ్ 14 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్ లతో 26 మెరుపులు మెరిపించాడు. అయితే మిగతా వారు సింగిల్ డిజిట్లకే అవుట్ అయిపోవడంతో మ్యాచ్ ను నిలబెట్టుకోలేకపోయారు. గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ 3, రషీద్‌ ఖాన్‌ 2, సాయి కిశోర్‌ 2, సిరాజ్‌, అర్షద్‌ ఖాన్‌, కుల్వంత్‌ కెజ్రోలియా ఒక్కో వికెట్‌ తీశారు. 

అదరగొట్టిన సాయి సుదర్శన్..

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇవాళ 23వ మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగింది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ ఎంచుకోగా గుజరాత్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. తాజాగా గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. దీంతో రాజస్తాన్ ముందు 218 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఓపెన్ గా వచ్చిన కెప్టెన్ శుభ్ మన్ గిల్ 2 అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన బట్లర్, సాయి సుదర్శన్ కలిపి పరుగుల వరద పారించారు.  గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ చెండాడేశాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో సుదర్శన్ పరుగుల వరద పెట్టించాడు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు ఊపు తెప్పించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 53 బాల్స్‌లో 82 పరుగులు సాధించాడు. తుషార్‌ దేశ్‌ పాండే వేసిన 18.2 ఓవర్‌లో వికెట్‌ కీపర్‌ సంజుశాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి సాయిసుదర్శన్‌ (82) వెనుదిరిగాడు. ఇతనితో పాటూ బట్లర్ 25 బంతుల్లో 36 పరుగులు,  షారుక్ 20 బంతుల్లో 36 పరుగులు, తివాటి 12 బంతుల్లో 24 పరుగులతో మెరుపులు మెరిపించారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | gujarath | rajasthan

Also Read: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

Advertisment
Advertisment
Advertisment