Glenn Maxwell : నీ దరిద్రం ఏంటన్నా ఇట్లుంది.. పాపం ఔట్ కాకున్నా..!

పంజాబ్ కింగ్స్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ తొలి బంతికే  ఖాతా తెరవకుండానే ఎల్బీగా వెనుదిరిగాడు. సాయికిశోర్ వేసిన ఈ బంతి వికెట్లకు తగులుతున్నట్లుగా కనిపించడంతో అంపైర్ ఔట్ గా ఇచ్చాడు. తీరా చూస్తే ఆ బంతి స్టంప్స్ మిస్ అయినట్లుగా కనిపించింది.

New Update
max-punjab

max-punjab

అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో తొలి బంతికే  మ్యాక్స్‌వెల్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. వాస్తవానికి సాయికిశోర్ వేసిన ఈ బంతి వికెట్లకు తగులుతున్నట్లుగా కనిపించడంతో అంపైర్ ఔట్ గా ఇచ్చాడు.  అయితే మ్యాక్స్‌వెల్ రివ్యూ తీసుకోకుండా వెళ్లిపోయాడు. తర్వాత చూస్తే ఆ బంతి స్టంప్స్ మిస్ అయినట్లుగా కనిపించింది. మ్యాక్స్‌వెల్ రివ్యూ తీసుకుంటే బాగుండేదని.. మరో ఎండ్ లో ఉన్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా రివ్యూ తీసుకోమని చెబితే బాగుండేదని అభిమానులు పోస్టులు పెడుతున్నారు.  

మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు

ఈ డకౌట్ కావడంతో మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో అత్యధిక (19) సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా నిలిచాడు. మ్యాక్స్‌వెల్  తరువాత రోహిత్ శర్మ (18) తర్వాతి స్థానంలో ఉన్నాడు. గతేడాది సీజన్ లో మ్యాక్స్‌వెల్ ఆర్సీబీ తరుపున కూడా ఇదే తరహా ఆటతీరు ఉండటంతో అతన్ని వదులుకుంది. పంజాబ్ అతన్ని రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రాంచేజీ మారిన మ్యాక్స్‌వెల్ ఆటలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.

మరోవైపు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం 64 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇందులో మూడు ఫోర్లు, ఆరు సిక్సులున్నాయి.  ప్రస్తుతం పంజాబ్ 15 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.  

Also Read :  Black And Green Grapes: నల్ల ద్రాక్ష, పచ్చని ద్రాక్షలో ఏది మంచిది.. ఏది ఆరోగ్యానికి ఉపయోగకరం?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

టోక్యో ఒలింపిక్స్ విజేత మీరాబాయి చానును ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె 49కేజీల విభాగంలో రజతం గెలుచుకున్నారు. వైస్ ఛైర్‌పర్సన్‌గా సతీస్ కుమార్ ఎన్నికయ్యారు.

New Update
_Mirabhai Chanu

టోక్యో ఒలింపిక్స్ విజేతమీరాబాయి చానుకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఆమెను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మీరా భాయి చాను 49 కిలోల విభాగంలో రజత పతకం గెలుచుకున్నారు. చైర్‌పర్సన్‌గా నియమించినందుకు వెయిట్ లిఫ్టింగ్ కమిషన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తన తోటి వెయిట్‌లిఫ్టర్ల వాయిస్ వినిపించేందుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం ఆమెకు చాలా గర్వకారణమని అన్నారు. అని టోక్యో పతక విజేత మీరాబాయి ఒక ప్రకటనలో తెలిపారు.

మీరాబాయి రెండుసార్లు 2018, 2022 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతక విజేత. 2017లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని, 2022లో రజతాన్ని గెలుచుకుంది. మీరాబాయి కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, ఒక రజతాన్ని గెలుచుకుంది. ఆమెతోపాటు కమీషన్ వైస్ ఛైర్‌పర్సన్‌గా సతీస్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత. వీరిద్దరి పదవీకాలం నాలుగేళ్ల పాటు కొనసాగుతుంది. అథ్లెట్లు, పాలకమండలి మధ్య వారధిగా ఈ వెయిట్ లిఫ్టర్లు పనిచేయనున్నారు. 

#Mirabhai Chanu #Weightlifting Federation #chairperson #Weightlifter
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు