Jos Buttler : ఆఫ్ఘనిస్తాన్‌ దెబ్బ.. జోస్ బట్లర్ గుడ్ బై!

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించిన  సంగతి తెలిసిందే. దీంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతలకు  జోస్ బట్లర్ గుడ్ బై చెప్పాడు. దీంతో రేపు సౌతాఫ్రికాతో జరగబోయే మ్యాచ్ అతనికి చివరిది కానుంది.

New Update
Jos Buttler

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించిన  సంగతి తెలిసిందే. దీంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతలకు  జోస్ బట్లర్ గుడ్ బై చెప్పాడు. దీంతో రేపు సౌతాఫ్రికాతో జరగబోయే మ్యాచ్ అతనికి చివరిది కానుంది.

ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో దారుణమైన ఓటమి

ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన బట్లర్ సేన, లాహోర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో దారుణమైన ఓటమిని చవిచూసింది. దీంతో జోస్ బట్లర్  కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కెప్టెన్సీ నుంచి బట్లర్ తప్పుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో జట్టు ఓటిమి పాలు కావడంతో ఇంగ్లాండ్ టీమ్ పై పెద్ద ఎత్తున  విమర్శలు వచ్చాయి.  జో రూట్ 120 పరుగులు చేసినప్పటికీ, ఇంగ్లాండ్ టీమ్ ఆఫ్ఘనిస్తాన్‌పై తమ 326 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక  317 పరుగులకే ఆలౌట్ అయింది.

ఇయాన్‌ మోర్గాన్‌ నుంచి బాధ్యతలు

కాగా బట్లర్  కెప్టెన్సీలోనూ  ఇటీవల భారత్‌తో జరిగిన టీ20, వన్డే సిరీసుల్లోనూ ఇంగ్లండ్‌ ఓడిపోయింది. ఇయాన్‌ మోర్గాన్‌ నుంచి 2022 జూన్‌లో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న బట్లర్‌ ఆ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే.  బట్లర్  కెప్టెన్సీలో ఇంగ్లాండ్ 44 వన్డే మ్యాచ్ లు ఆడగా, 18 విజయాలు, 25 ఓటములను చవిచూసింది.  ఇక 51 టీ20ల్లో, అతను 26 విజయాలు, 22 ఓటములను చవిచూసింది. కాగా జోస్ బట్లర్ తర్వాత ఇంగ్లాండ్ జట్టుకు కొత్త వైట్-బాల్ కెప్టెన్ ఎవరు అవుతారో ఇంకా తెలియాల్సి ఉంది. 

Also Read :   SLBC Tunnel : టన్నెల్‌లో మృతదేహాలు లభించాయనేది అవాస్తవం  :  కలెక్టర్‌ క్లారిటీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS GT : సన్‌రైజర్స్ కు బిగ్ షాక్ ..  మహమ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు

ఉప్పల్ స్డేడియంవేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ లో వంద వికెట్లు తీసిన 12వ బౌలర్ గా రికార్డు సృష్టించాడు.

New Update
siraj 100

siraj 100

ఉప్పల్ స్డేడియంవేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. -ఐపీఎల్ లో వంద వికెట్లు తీసిన 12వ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. 97 ఐపీఎల్ మ్యాచ్ లలో సిరాజ్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్ గా ఐపీఎల్ లో వంద వికెట్లు తీసిన 26 బౌలర్ గా నిలిచాడు.  సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు..  ట్రావిస్ హెడ్ (8), అభిషేక్ శర్మ (18) లను ఔట్ చేయడం ద్వారా  సిరాజ్ ఈ ఘనత అందుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ 6 ఓవర్లకు గానూ రెండు కీలక మైన 2 వికెట్ల కోల్పోయి 45 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ (2), ఇషాన్ కిషన్ (15) క్రీజులో ఉన్నారు.

Also Read :  దేశానికి స్ఫూర్తినిచ్చిన పోరాటం..ఆ భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ

Also read :  డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

జట్లు ఇవే 

సన్‌రైజర్స్ హైదరాబాద్ :  ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ షమీ

గుజరాత్ టైటాన్స్ :  సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్ ), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ

Advertisment
Advertisment
Advertisment