సచిన్‌ రికార్డు బద్ధలు కొట్టిన జో రూట్.. టెస్టుల్లో ఏకైక మొనగాడు

టెస్టుల్లో సచిన్ రికార్డును ఇంగ్లాండు బ్యాటర్ జో రూట్ బ్రేక్ చేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు (1630) చేసిన ఆటగాడిగా జో రూట్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఈ ఘనత సాధించాడు. సచిన్ టెండూల్కర్ 1625 రన్స్ చేశాడు. 

author-image
By srinivas
New Update
ererere

ROOT: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టెస్టు క్రికెట్ రికార్డు బద్ధలైంది. ఇంగ్లాండ్‌ స్టార్ బ్యాటర్ జో రూట్ సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు (1630) చేసిన ఆటగాడిగా రూట్ రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు.

కేవలం 49 ఇన్నింగ్స్ ల్లోనే.. 

ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (1625 పరుగులు) పేరిట ఉండేది. సచిన్ 60 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా రూట్ 49 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటికే టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక రన్స్‌ చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతున్న జో రూట్.. 150 టెస్టులు ఆడి12,777 రన్స్ చేశాడు. ఇక మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. 

ఇది కూడా చదవండి: రైతు భరోసాపై రేవంత్ గుడ్ న్యూస్.. కీలక ప్రకటన!

జో రూట్ - 1630 (49 ఇన్నింగ్స్‌లు)
సచిన్ టెండూల్కర్ - 1625 (60 ఇన్నింగ్స్‌లు)
అలిస్టర్ కుక్ - 1611 (53 ఇన్నింగ్స్‌లు)
గ్రేమ్ స్మిత్ - 1611 (41 ఇన్నింగ్స్‌లు)
శివనారాయణ్ చందర్‌పాల్ - 1580 (49 ఇన్నింగ్స్‌లు)

ఇది కూడా చదవండి: 14 ఏళ్ల తర్వాత ఉలిక్కిపడ్డ ఓరుగల్లు.. మావోయిస్టుల దారెటు?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBKS VS CSK: పంజాబ్ విజయం..ఇక చెన్నై ఇంటికే..

ఐపీఎల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై పంజాబ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ కిది వరుసగా మూడో విజయం కాగా..సీఎస్కేకు వరుసగా నాలుగో పరాజయం.

New Update
ipl

PBK VS CSK

చెన్నై కథ ఇక ముగినట్లే. వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో అడుగుకు చేరిన చెన్నై సూపర్ కింగ్స్ కు ప్లే ఆప్స్ ఆశలు మూసుకుపోయినట్టే. ఈరోజు పంజాబ్ తో జరిగిన పోరులో చెన్నై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు భారీ స్కోరు చేసింది. ఈ టార్గెట్ తో బరిలోకి దిగిన  చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీఎస్కే బ్యాటర్లలో డెవాన్‌ కాన్వే  49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69 పరుగులు చేసి రిటైర్డ్‌ ఔట్‌ అయ్యాడు. తరువా శివమ్‌ దూబె  27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42, రచిన్‌ రవీంద్ర  23 బంతుల్లో 6 ఫోర్లతో 36, ధోనీ  12 బంతుల్లో ఒక ఫోర్‌, 3 సిక్స్‌లతో 27 పరుగులు చేసి రాణించారు. అయితే నిర్ణీ ఓవర్లలో టర్గెట్ ను మాత్రం చేరుకోలేకపోయారు.  పంజాబ్‌ బౌలర్లలో ఫెర్గూసన్‌ 2, మాక్స్‌వెల్‌, యశ్‌ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ తీశారు. చెన్నైకి ఇది వరుసగా ఇది నాలుగో ఓటమి.

ప్రియాంశ్ ఆర్య సెంచరీ..

అంతకు ముందు పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 219/6 రన్స్ చేసింది. పంజాబ్ ఒపెనర్ ప్రియాన్ష్ ఆర్య 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. చివరల్లో శశాంక్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మాద్ 2, అశ్విన్ 2, ముఖేష్‌ 1, నూర్ 1 వికెట్ పడగొట్టారు. ముల్లనూర్ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ సార‌థి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ బ్యాటర్లు మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడారు. ఒపెనర్ ప్రియాన్ష్ ఆర్య 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 9 సిక్సులు, 7 ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. మరోవైపు చెన్నై బౌలర్లు సైతం వరుస వికెట్లు పడగొట్టారు. ప్రియాన్ష్ మినహా ఏ బ్యాటర్ ఎక్కవ సేపు క్రీజులో నిలవలేకపోయారు. చివరల్లో శశాంక్ 52 మెరుపులు మెరిపించాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | csk | match | punjab 

Also Read: Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

Advertisment
Advertisment
Advertisment