Cricket: రెండో టెస్ట్‌లోనూ భారత్ విజయం..సీరీస్ క్లీన్ స్వీప్

కాన్పూర్‌‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో భారత్ సీరీస్‌ను కైవసం చేసుకుంది. 

New Update
cricket

India Vs Bangladesh: 

అంతర్జాతీయ టెస్ట్ ర్యాకింగ్‌లో భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల సీరీస్‌లో రెండింటిలోనూ విజయం సాధించి..పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. ఇక రెండో టెస్ట్‌ మొదటి నుంచీ ఇంట్రస్టింగ్‌గా సాగింది. మొదటి రెండు రోజులు వర్షం కారణంగా అసలు ఆట సాగనేలేదు. మొదటి రోజు కేవలం 35 ఓవర్లు మాత్రమే పడ్డాయి. ఆ తరువాత  ఆగిపోయింది. ఈ సమయంలో మ్యాచ్ డ్రా అవుతుంది అనుకున్నారు. కానీ మూడ రోజు నుంచీ భారత్ దూకుడుగా ఆడి ఆద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లా 233 పరుగులు చేయగా.. భారత్ 285/9 స్కోరు దగ్గరఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 146 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ 95 ప‌రుగుల ల‌క్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ టెస్ట్ మ్యాచ్ మొత్తం టీమ్ ఇండియా టీ20 తరహా ఆటను ఆడింది. యశస్వి జైస్వాల్ ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలవగా.. రవిచంద్రన్ అశ్విన్‌ ‘ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డును అందుకున్నాడు.

రెండో మ్యాచ్ కూడా గెలిచిన భారత్...బంగ్లాదేశ్ తో జరిగిన రెండు టెస్ట్‌ల సీరీస్ ను 2–0 తేడాతో ఎగురేసుకుపోయింది. మరోవైపు స్వదేశంలో భారత్‌ తిరుగులేని జట్టుగా నిలిచింది.  సొంత దేశంలో వరుసగా 18 మ్యాచ్‌లు గెలిచి అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇక ఈ సిరీస్‌  విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమ్‌ఇండియా టాప్ పొజిషన్‌ను సుస్థిరం చేసుకుంది. దాంతో పాటూ వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకోవడానికి మార్గం సుగమం చేసుకుంది. ఈ డబ్ల్యూటీసీలో భారత్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 8 విజయాలు, 2 ఓటములు, ఒక డ్రా ఉన్నాయి. ప్రస్తుతం భారత జట్టు  PCT 74.27తో టాప్‌లో ఉంది.

Also Read: Israel: కాంకర్ ది గలీలీకి హెజ్బుల్లా ప్లాన్–ఇజ్రాయెల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..!

చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్లి బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు.

author-image
By Archana
New Update

Life Style: ఇదొక మెడికల్ మిరాకిల్ అనే పదం వినే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్ళీ బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు. సాధారణంగా గుండె ఆగిపోయినప్పుడు.. మెదడు రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ఇస్కీమియాకు దారితీస్తుంది. ఇస్కీమియా అనేది శరీరంలో కొంత భాగానికి రక్త ప్రవాహం తక్కువగా ఉండడం. సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. ఇలాంటి పరిస్థితిల్లో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి శాశ్వతంగా మెదడు క్షీణించటం మొదలవుతుంది. అంతేకాదు  గుండెపోటు గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది.

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

చైనా శాస్త్రవేత్తలు అద్భుతం 

ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు చనిపోయిన పంది మెదడును బతికించిన ఫలితాలు .. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిన నిమిషాల వ్యవధిలోనే మెదడు శాశ్వతంగా క్షీణించటం మొదలవుతుందనే భావనను సవాలు చేసేలా ఉన్నాయి. అయితే పందులు చనిపోయిన తర్వాత నాలుగు గంటల అనంతరం వాటి మెదళ్లను పాక్షికంగా పునరుద్ధరించిన ఘటన 2019లోనూ జరిగింది. 

బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? 

మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది.

బ్రెయిన్ డెడ్ కారణాలు

  • మెదడుకు తీవ్రమైన గాయమైనప్పుడు
  • మెదడులో రక్తస్రావం జరగడం (ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్) 
  • ఇస్కీమిక్ స్ట్రోక్ ( సరైన ఆక్సిజన్ అందకపోవడం) 
  • గుండెపోటు
  • మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు