ఆస్ట్రేలియా మీడియాలో బుమ్రా నామస్మరణ.. ఆటగాళ్లు సైతం ఫిదా!

ఆస్ట్రేలియా మీడియాలో భారత బౌలర్ జస్ప్రిత్ బుమ్రా నామస్మరణ మారుమోగుతోంది. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే బుమ్రా మేటి బౌలర్ అంటూ ఆసీస్ ఆటగాళ్లు పొగిడేస్తున్నారు. బుమ్రా బౌలింగ్ గొప్పతనం గురించి రాబోయే తరాలకు చెబుతామంటూ ట్రావిస్ హెడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

author-image
By srinivas
New Update
Bumrah: బంతులు కాదు బుల్లెట్లు.. రికార్డ్ చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే!

Bumrah: ఆస్ట్రేలియా మీడియాలో భారత బౌలర్ జస్ప్రిల్ బుమ్రా నామస్మరణ మారుమోగుతోంది. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే బుమ్రా మేటి బౌలర్ అంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఆసీస్ ఆటగాళ్లు సైతం బుమ్రా బౌలింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని బౌలింగ్ లో బ్యాటింగ్ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, తమ రాబోయే తరాలకు ఈ విషయం గొప్పగా చెబుతామంటూ తెగ పొగిడేస్తున్నారు. 

Also Read: హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!?

బౌలింగ్‌ శైలి అంతుచిక్కట్లేదు..

ఈ మేరకు ఇటీవలే స్టార్ బ్యాట్ స్టీవ్ స్మిత్ బుమ్రా బౌలింగ్ లో ఎన్నిసార్లు ఆడినా సవాలుగా అనిపిస్తుందన్నాడు. బుమ్రా బౌలింగ్‌ శైలి అంతుచిక్కట్లేదని, కనురెప్పపాటులో బాల్ దూసుకొస్తుదంటూ తనదైన స్టైల్ లో అభినందించాడు. అయితే తాజాగా ప్రపంచ మేటి బ్యాటర్లలో ఒకడై ట్రావిస్ హెడ్ సైతం బుమ్రా బౌలింగ్ కు ఫిదా అయ్యాడు. బుమ్రా ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే మేటి ఫాస్ట్‌ బౌలర్.  కెరీర్‌ను గొప్పగా ముగిస్తాడు. అతని బౌలింగ్ లో నేను బ్యాటింగ్ చేశానని నా మనవళ్లకు చెప్పుకుంటా అంటూ రీసెంట్ ఇంటర్య్వూలో చెప్పడం గమనార్హం. కాగా వీరిద్దరు కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ కు కిక్ ఇస్తున్నాయి. 

Also Read: 'పుష్ప2' టికెట్ రేట్ల పెంపు కేసు.. హైకోర్టు సంచలన తీర్పు

ఆస్ట్రేలియా ఆటగాళ్లే కాదు భారత మాజీలు సైతం పొగిడేస్తున్నారు.  భారత మాజీ ఫాస్ట్‌బౌలర్‌, ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు కోచ్‌గా ఉన్న ఆశిశ్‌ నెహ్రా బుమ్రాను ప్రశంసించాడు. అతను ఐపీఎల్ వేలంలో బరిలోకి దిగితే జట్లకు రూ.520 కోట్ల పర్స్‌ ఉన్నా సరిపోదంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇక బోర్డర్‌-గావస్కర్‌ తొలి టెస్టులో 8 వికెట్లు పడగొట్టి భారత్ కు విజయాన్ని అందించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 

Also Read: వీరనారి ఐలమ్మ గుర్తుగా.. త్వరలో మహిళా వర్సిటీ బిల్లు!

Also Read: తెలంగాణ ప్రభుత్వ శాఖలో అవినితీ తిమింగలాలు.. రూ.500 కోట్ల స్కామ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING : ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు.  ఐసీసీ కారణంగానే పాక్‌తో తటస్థ వేదికల్లో ఆడుతున్నట్లు రాజీవ్ శుక్లా వెల్లడించారు.

author-image
By Krishna
New Update
bcci pakistan

bcci pakistan

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు.  ఐసీసీ కారణంగానే పాక్‌తో తటస్థ వేదికల్లో ఆడుతున్నట్లు రాజీవ్ శుక్లా వెల్లడించారు.  ఇక్కడేం జరుగుతుందో ఐసీసీకి అవగాహన ఉందనుకుంటున్నా అని ఆయన తెలిపారు.  కాగా  2008లో ముంబై దాడి కారణంగా భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లడం లేదు.  భారత జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో పర్యటించింది. అప్పుడు టీం ఇండియా ఆసియా కప్‌లో పాల్గొంది. కాగా ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో టీమిండియా భారీ తేడాతో గెలిచింది. కాగా . కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 28మంది టూరిస్టులు చనిపోయారు.  

Advertisment
Advertisment
Advertisment