Ashwin: మరో రికార్డుకు చేరువలో అశ్విన్.. ఏకైక బౌలర్ గా!

భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఒకే ఇన్నింగ్స్ లో మరో 5 వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికసార్లు (38) 5 వికెట్లు పడగొట్టిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు.  

author-image
By srinivas
New Update
IND vs ENG: టీమిండియాకు భారీ షాక్‌.. సడన్‌గా టీమ్‌ని వీడిన అశ్విన్‌.. ఎందుకంటే?

Ashwin: భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. న్యూజీలాండ్ తో శుక్రవారం మొదలుకానున్న మూడో టెస్టులో అశ్విన్ మరో 5 వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికసార్లు 5 వికెట్లు పడగొట్టిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటికే 37 సార్లు 5 వికెట్లు పడగొట్టి అనిల్ కుంబ్లే రికార్డు సమం చేసిన అశ్విన్.. మరొక్కసారి 5 వికెట్ల ఫీట్ సాధిస్తే 38 సార్లు ఈ ఘనత అందుకోనున్నాడు. 

ఎనిమిదిసార్లు 10 వికెట్లు..

ఇక అనిల్ కుంబ్లే 35 సార్లు, వన్డేల్లో రెండుసార్లు ఐదేసి వికెట్లు పడగొట్టగా.. టెస్టులో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎనిమిదిసార్లు 10 వికెట్ల ఫీట్ సాధించాడు. న్యూజీలాండ్ తో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో అశ్విన్ ఆరు వికెట్లు తీశాడు. ముంబైలో జరగనున్న మూడో టెస్టులో అశ్విన్ ప్రభావం చూపించే అవకాశముంది. ఈ పిచ్‌ స్పిన్నర్లకు సహకరిస్తుందని తెలుస్తుండగా.. ఈ వేదికలో భారత్, న్యూజిలాండ్ చివరగా 2021 డిసెంబరులో టెస్టు మ్యాచ్‌లో తలపడగా.. స్పిన్నర్లు అత్యధిక వికెట్లు తీశారు. 

ఇది కూడా చదవండి: Iran: అమెరికా ఎన్నికలకు ముందే అణుబాంబు దాడి.. ఇరాన్‌ బిగ్ ప్లాన్!

అజాజ్ పటేల్‌ రికార్డు..

టీమ్ఇండియా 325 పరుగులకు ఆలౌట్ కాగా.. మొత్తం 10 వికెట్లు స్పిన్నర్ అజాజ్ పటేల్‌ తీశాడు. అశ్విన్ (4/8), అక్షర్ పటేల్ (2/14),  సిరాజ్ (3/19) ధాటికి కివీస్ 62 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌ను భారత్ 276/7 వద్ద డిక్లేర్ చేసింది. అజాజ్ పటేల్ 4, రచిన్ రవీంద్ర 3 వికెట్లు తీశారు. 540 పరుగులతో బరిలోకి దిగిన కివీస్ 167 రన్స్‌కు ఆలౌటైంది. భారత స్పిన్నర్లు అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు దక్కించుకున్నారు. దీంతో భారత్ ఘన విజయం దక్కించుకుంది. ఇక నవంబర్ 1 నుంచి భారత్-న్యూజీలాండ్ మధ్య 3వ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే న్యూీజీలాండ్ 0-2 తో సిరీస్ కైవసం చేసుకుంది. 

ఇది కూడా చదవండి: TG Train: తెలంగాణ రైలు ప్రయాణికులకు శుభవార్త.. మరో రెండు కొత్త లైన్లు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK vs SRH : హర్షల్ పటేల్ దెబ్బకి చెన్నై విలవిల.. 154 పరుగులకు ఆలౌట్

ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో చెన్నై ఆలౌటైంది. 19.5 ఓవర్ల వద్ద 154 పరుగులకు పరిమితమైంది. బ్రెవిస్‌(42), ఆయుష్‌(30), దీపక్‌(22) జడేజా(21) ఫర్వాలేదనిపించారు.

New Update
harshal-patel

harshal-patel

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ 43వ మ్యాచ్ CSK VS SRH మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో క్రీజ్‌లోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ తడబడుతూ ఆడింది. మొత్తంగా తొలి ఇన్నింగ్స్ పూర్తి చేసుకుంది. 19.5 ఓవర్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ 154 పరుగులకు ఆలౌటైంది. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందు 155 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.  

Also Read :  మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!

Also Read :  ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

CSK VS SRH

చెన్నై బ్యాటింగ్‌లో బ్రేవిస్‌ 42, ఆయుష్‌ మాత్రే 30 రాణించారు. దీపక్‌ హుడా 22, రవీంద్ర జడేజా 21 ఫర్వాలేదనిపించాడు. షేక్‌ రషీద్‌ 0, శ్యామ్‌ కరన్‌ 9, ధోనీ 6 విఫలమయ్యారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌లో హర్షల్‌ పటేల్‌ 4 వికెట్లతో చెలరేగిపోయాడు. అతడికి మరికొందరు బౌలర్లు తోడయ్యారు. ప్యాట్‌ కమిన్స్‌ 2, జయదేవ్‌ ఉనద్కత్‌ 2, మహ్మద్‌ షమి 1, కమిందు మెండిస్‌ 1 వికెట్‌ తీసుకున్నారు.

Also Read :  నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..

Also Read :  బీచ్‌లో బుసలు కొడుతున్న సుప్రిత.. హాట్ అందాలకు కుర్రకారు ఫిదా

 IPL 2025 | sunrisers-hyderabad | Chennai Super Kings

Advertisment
Advertisment
Advertisment