South Africa: టెస్టుల్లో దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు.. అత్యధిక సిరీస్‌లు నెగ్గిన టీమ్‌గా!

టెస్టు క్రికెట్‌లో దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు సృష్టించింది. విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో విజయంతో వరుసగా ఒకే జట్టు(వెస్టిండీస్‌)పై 10 సిరీస్‌లు గెలిచిన జట్టుగా అవతరించింది. సౌతాప్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ నిలిచాడు.

New Update
South Africa: టెస్టుల్లో దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు.. అత్యధిక సిరీస్‌లు నెగ్గిన టీమ్‌గా!

South Africa: టెస్టు క్రికెట్‌లో దక్షిణాఫ్రికా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. విండీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో విజయం సాధించిన సౌతాఫ్రికా.. ఒక జట్టుపై వరుసగా అత్యధికంగా 10 సిరీస్‌లు నెగ్గిన టీమ్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతకుముందు ఈ రికార్డు టీమ్‌ఇండియా (9), ఆస్ట్రేలియా (9) పేరిట ఉండగా.. ఇప్పుడు పది సిరీస్ లతో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో నిలిచింది.

ఈ మేరకు వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా ఇప్పటివరకు 33 టెస్టుల్లో తలపడగా.. దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య 1992లో జరిగిన ఏకైక టెస్టులో సౌతాఫ్రికా ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన 10 సిరీస్‌లను కైవసం చేసుకుని విండీస్‌పై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇక దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. సౌతాప్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా నిలిచాడు. హ్యూ టేఫీల్డ్ (170) వికెట్ల రికార్డును కేశవ్‌ బ్రేక్‌ చేశాడు. ఈ సిరీస్ లో 13 వికెట్లు తీసిన కేశవ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్నాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు.  దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

New Update
iPHONE 16 Trump Tariffs

iPHONE 16 Trump Tariffs Photograph: (iPHONE 16 Trump Tariffs)

గత పది రోజులుగా ప్రపంచం మొత్తం టారీఫ్ ల వార్ తో దడదడలాడిపోతోంది. టారీఫ్ లతో దాదాపు అన్ని దేశాలనూ బెంబేలెత్తించారు. అయితే రెండు రోజు క్రితం ఈ సుంకాలకు 90 రోజుల బ్రేక్ ను కల్పిస్తూ అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇందులో చైనాను మాత్రం కలపలేదు. దీంతో మిగతా దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకున్నా చైనాతో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా సుంకాల విషయంలో మరో కీలక నిర్ణయం ప్రకటించింది అమెరికా. 

ఫోన్లు, కంప్యూటర్ల మీద..

అమెరికా మీద చైనా 125 శాతం, అమెరికా 145 శాతం సుంకాలను విధించుకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తుల మీద 145 ఉంటాయి కానీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల మీద కాదంటూ ఒక కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డ్రైవ్‌లు, కంప్యూటర్‌ ప్రాసెసర్లు, మెమొరీ చిప్‌లు, సెమీ కండక్టర్లు, సోలార్‌ సెల్స్‌, ఫ్లాట్‌ టీవీ డిస్‌ప్లేలు వంటి వాటిని ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి. అమెరికాకు చెందిన యాపిల్ సంస్థకు సంబంధించి ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం చైనా నుంచే వస్తాయి. 

యాపిల్ కంపెనీకి ఊరట..

సుంకాల పెంచడంతో స్మార్ట్ ఫోన్లు, యాపిల్ ఫోన్లు ధరలు పెరుగుతాయని వినియోగదారుల్లో ఆందోళన పెరిగింది. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం అమెరికా వాసులు స్టోర్లకు కూడా పరుగెత్తారు. కానీ ఇప్పుడు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. నిజానికి ప్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ఉత్పత్తుల మీద ప్రతీకార సుంకాలను పెంచాలంటే అవన్నీ అమెరికాలోనే తయారు చేయాలి. కానీ అక్కడ ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి తయారీ కంపెనీలను పెట్టడం కూడా  కుదరదు.  దీనికి కొన్నేళ్ళు సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అమెరికా సుంకాల నిర్ణయంతో అత్యధికంగా నష్టపోయిన యాపిల్ కంపెనీ...ఇప్పుడు తాజా నిర్ణయంతో హమ్మయ్య అనుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 today-latest-news-in-telugu | usa | china | trump tariffs | apple | i-phone

Also Read: SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

 

Advertisment
Advertisment
Advertisment