Miniter Seethakka: త్వరలో అంగన్‌ వాడీలో 11 వేల పోస్టుల భర్తీ!

New Update
Miniter Seethakka: త్వరలో అంగన్‌ వాడీలో 11 వేల పోస్టుల భర్తీ!

Anganwadi : రాష్ట్రంలో అతి త్వరలోనే 11 వేల అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) స్పష్టం చేశారు. 15 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్లే స్కూళ్లను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీతక్క మాట్లాడుతూ.. తన శాఖల స్థితిగతులు, పాలన తీరు, నూతన ఆలోచనలు, వాటి కార్యాచరణ, ఇతర అంశాలను మంత్రి సీతక్క వివరించారు.

స్త్రీ శిశు సంక్షేమంలో అంగన్‌వాడీలదే ముఖ్యమైన పాత్ర అని మంత్రి సీతక్క అన్నారు. లోపాలను అరికట్టి ఆ వ్యవస్థను బలోపేతం చేసేందుకు పర్యవేక్షణ చర్యలు చేపట్టినట్లు ఆమె వివరించారు. గతంలో అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా కాంట్రాక్టు రెండేళ్ల పాటు ఒకే గుత్తేదారుకు ఇవ్వడం వల్ల నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము అధికారంలోకి వచ్చాక ఆ నిబంధనలు అన్ని మారాయని... ఆహారం, గుడ్ల సరఫరా పకడ్బందీగా సాగుతోందని అన్నారు. అంగన్‌వాడీలకు ఫర్నిచర్, ఇతర సామగ్రిని సమకూర్చినట్లు పేర్కొన్నారు. వాటిలో 11 వేల ఖాళీలను గుర్తించామని చెప్పిన మంత్రి త్వరలోనే వాటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ విరమణ సమయంలో అంగన్‌వాడీ టీచర్లకు రూ. రెండు లక్షలు, ఆయాలకు రూ. లక్ష చెల్లిస్తున్నామని వివరించారు.

రాష్ట్రంలో 35 వేల అంగన్‌వాడీ కేంద్రాలుండగా (Anganwadi Centers) 15 వేలల్లో నర్సరీ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దీని కోసం అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆంగ్ల బోధన, ఇతర అంశాలపై శిక్షణ ఇచ్చామని వివరించారు. ప్లే స్కూళ్లను ప్రాథమిక పాఠశాలల ప్రాంగణాల్లోనే నిర్వహిస్తామని తద్వారా పిల్లలు నర్సరీ పూర్తి చేసిన వెంటనే ప్రాథమిక పాఠశాలల్లో చేరతారని వివరించారు.

Also read: మూడు నెలలుగా జీతం అందుకోని పినాకి చంద్రఘోష్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

pahalgam terrorist attack: హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్..ఉగ్రదాడి జరగొచ్చనే హెచ్చరికలు

టెర్రరిస్టులు ఇంకా భారత్ లోనే ఉన్నారు. వారి కోసం భద్రతా దళాల వేట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పహల్గామ్ తరహాలో మరోసారి ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్ ప్రకటించారు. 

New Update
india

High Alert In Himachal Pradesh

కాశ్మీర్ లో పహల్గామ్ లోని బైసరన్ వ్యాలీలో దాడులు జరిగి రెండు రోజులు అవుతున్నా దాని నుంచి ఇంకా కోలుకోలేదు. యావత్ భారతదేశం శోక సంద్రంలో మునిగిపోయింది. ఉగ్రవాదుల మీద కోపంతో రగిలిపోతోంది. ఉగ్రవాదుల తలలు కావాలని దాడిలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. కేంద్రం కూడా ఈ ఉగ్రదాడిని తీవ్రంగా తీసుకుంది. ఇందులో భాగంగా నిన్న పాకిస్తాన్ మీద కఠిన చర్యలు తీసుకుంది. ఆ దేశంతో దౌత్యపరమైన సంబంధాలను క్యాన్సిల్ చేసుకున్నారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు. 

బార్డర్ దగగర హై సెక్యూరిటీ..

ఇదెలా ఉంటే టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలిస్తున్నారు. కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వారిని గుర్తుపట్టారు. వారి ఫోటోల ఆధారంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులు ఇంకా దేశంలోనే ఉన్నారని తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో పహల్గామ్ తరహాలో మరో ఉగ్రదాడి జరగొచ్చని అంటున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు. హిమాచల్ ప్రదేశ్ లో దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్ ప్రకటించింది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు పోలీసులును ఆదేశించారు. ముఖ్యంగా జమ్ము, కాశ్మీర్ బార్డర్ ను పంచుకునే హిమాచల్ ప్రదేశ్ లోని చంబా, కంగ్రా జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. కాశ్మీర్ నుంచి పారిపోయిన ఉగ్రవాదులు హిమాచల్ ప్రదేశ్ వైపు రావొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

pahalgam terrorist attack | today-latest-news-in-telugu | himachal-pradesh | high-alert

Also Read: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్

Advertisment
Advertisment
Advertisment