Skin Care: 10 నిమిషాల్లో మెరిసే చర్మం కోసం ఈ టిప్స్ పాటించండి చాలు..!

అమ్మాయిలకు అన్నింటి కంటే ముఖ్యమైనది వారి ముఖ సౌందర్యం. అమ్మాయిలు వారికి ఎన్ని పనులున్నా సరే ముఖం పై మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అందంగా, ప్రకాశవంతగా మెరిసిపోయే చర్మం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందం వాళ్ళలోని ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.  ఈ సింపుల్ టిప్స్ తో పాటిస్తే 10 నిమిషాల్లో అందమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చు.

New Update
Skin Care:  10 నిమిషాల్లో మెరిసే చర్మం కోసం ఈ టిప్స్ పాటించండి చాలు..!

Skin Care: అమ్మాయిలకు అన్నింటి కంటే ముఖ్యమైనది వారి ముఖ సౌందర్యం. అమ్మాయిలు వారికి ఎన్ని పనులున్నా సరే ముఖం పై మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అందంగా, ప్రకాశవంతగా మెరిసిపోయే చర్మం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందం వాళ్ళలోని ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.  ఈ సింపుల్ టిప్స్ తో పాటిస్తే 10 నిమిషాల్లో అందమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చు.

ముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి

మీ చర్మానికి సూట్ అయ్యే ఫేస్ వాష్ లేదా క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రంగా కడగాలి.ఇది చర్మంలోని డెడ్ సెల్స్ , దుమ్ము, ధూళిని తొలగించి ముఖంలో కాంతివంతమైన ఛాయను తీసుకొస్తుంది.

పేస్ మాస్క్ వాడాలి 

ముఖం పై ఫేస్ మాస్క్ వాడటం వల్ల అది చర్మాన్ని మరింత కాంతివంతగ చేస్తుంది. తేనే, పసుపు, పెరుగు ఇలా సహజ ఉత్పత్తులను కలిగిన ఫేస్ మాస్క్ ను 10 నిమిషాల పాటు ధరించి ఆ తర్వాత మొహం కడిగితే కేవలం10 నిమిషాల్లో మీ మొహన్ని మెరిసేలా చేస్తుంది.

చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచాలి

చర్మం ఎప్పుడు ప్రకాశవంతంగా ఉండాలంటే మాయిశ్చరైజర్ తప్పని సరిగా రాసుకోవాలి. హైలురానిక్ ఆసిడ్, అలోవెర, గ్లిసరిన్ వంటి పదార్థాలు ఉన్న మాయిశ్చరైజర్ ను వాడటం వాళ్ళ మీ చర్మం రోజంతా హైడ్రేటెడ్ గా ఉంటుంది.

హై లైటర్ వాడండి 

హై లైటర్ మొహం పై అప్లై చేస్తే కొద్దీ నిమిషాల్లోనే మెరిసిపోయే చర్మాన్ని అందిస్తుంది. మీ చర్మ సున్నితత్వానికి సరిపడే హై లైటర్ తీసుకొని దాన్ని చెంపల పై భాగంలో, ముక్కు పై అప్లై చేస్తే అది ముఖం ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది.

నీళ్లు ఎక్కువగా తాగాలి

చర్మం ఎల్లప్పుడూ తేమగా పొడిబారకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. దాని వల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తాగాలి.

సరైన నిద్ర తప్పనిసరి

మెరిసే చర్మం, కాంతివంతమైన ఛాయా కావాలంటే సరైన నిద్ర తప్పనిసరి. రోజుకు 7-8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి. సరైన నిద్ర చర్మాన్ని రిపేర్ చేయడంతో పాటు ముఖం ప్రకాశవంతంగా ఉండటానికి సహాయపడుతుంది.

ముఖం పై ఏదైనా ప్రయోగించేటప్పుడు చర్మ సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. సహజంగా చర్మం కాంతివంతగా ఉండాలంటే సరైన నీళ్లు, నిద్ర తప్పనిసరి అవసరం వాటితో పాటు మనం వాడే సరైన చర్మ ఉత్పత్తులు అవసరం.

Also Read: Digestion: అజీర్ణ సమస్య ఉన్నవాళ్లు ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే చాలు..?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Allu Arjun- Atlee: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ హైప్ నెలకొంది. బన్నీ డ్యూయల్ రోల్, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఉండనున్నారని టాక్‌ ప్రచారంలో ఉంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది.

New Update
Allu Arjun – Atlee

Allu Arjun – Atlee Movie

Allu Arjun- Atlee : ఇటీవల టాలీవుడ్ లో హైప్ క్రియేట్ చేసిన ఓ భారీ ప్రాజెక్ట్ ఏమిటంటే.. అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందనున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చిన నాటి నుంచి ఎన్నో ఆసక్తికర రూమర్స్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై, కొన్ని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారన్న టాక్ హీట్ పెంచింది. అంతేకాదు, ఈ చిత్రానికి గ్లోబల్ స్టాండర్డ్స్‌ను లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల, హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ టాప్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు తెరపైకి వచ్చింది. హాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెను ఎంపిక చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

ఇప్పటికే ప్రియాంక చోప్రా, మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఇంటర్నేషనల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన కూడా ఆమె కనిపిస్తే, అది మరో క్రేజీ కాంబోగా మారనుంది. అయితే దీనిపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: ఫ్యాన్స్ కు మెగా ట్రీట్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.

ఈ గ్రాండ్ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. బడ్జెట్ పరంగా, విజువల్ ట్రీట్ పరంగా ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో తెరకెక్కించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం.

Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!

మొత్తానికి అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ హైప్‌ను సృష్టించగా, కథ, తారాగణం, టెక్నికల్ టీమ్ డీటెయిల్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment