KS Chitra: అయోధ్య రామ మందిర వేడుక పై గాయని చిత్ర సోషల్ మీడియా పోస్ట్‌.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న గాయని!

జనవరి 22 వ తేదీ సోమవారం నాడు ప్రజలంతా కూడా రామనామాన్ని జపించడంతో పాటు సాయంత్రం దీపాలు వెలిగించాలంటూ గాయని చిత్ర సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. దీంతో ఆమె పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ రాజకీయ పక్షం వైపు ఆమె మాట్లాడరంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు.

New Update
KS Chitra: అయోధ్య రామ మందిర వేడుక పై గాయని చిత్ర సోషల్ మీడియా పోస్ట్‌.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న గాయని!

జనవరి 22 న ఎంతో వేడుకగా జరగబోతున్న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం గురించి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసినందుకు గాయని కేఎస్ చిత్ర తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఓ రాజకీయ పక్షం వైపు ఆమె మాట్లాడటం సరికాదంటూ కొందరు ఆమెను విమర్శిస్తున్నారు.

అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠపన కార్యక్రమం జరిగే జనవరి 22 వ తేదీ సోమవారం నాడు ప్రజలంతా కూడా రామనామాన్ని జపించడంతో పాటు సాయంత్రం దీపాలు వెలిగించాలంటూ చిత్ర సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. దీంతో ఆమె పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జనవరి 22 మధ్యాహ్నం 12 గంటలకు ప్రతి భారతీయుడు కూడా శ్రీ రామ జయ రామ, జయ జయ రామ అంటూ రామ మంత్రాన్ని జపించాలని, అదే విధంగా ఆరోజున ఇంట్లో ఐదు ఒత్తుల దీపాన్ని కూడా వెలిగించి రాముల వారి ఆశీర్వాదాన్ని పొందాలని ఆమె సోషల్‌ మీడియాలో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. చివరిలో ఆమె లోక సమస్త సుఖినో భవంతు అంటూ ఆమె వీడియోని ముగించారు.

ఇప్పుడు ఈ వీడియో పై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు హోరెత్తుతున్నాయి. ఈ వీడియోను చూసిన గాయకుడు సూరజ్‌ సంతోష్‌ స్పందించారు. లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పడం గాయని చిత్ర అమాయకత్వమంటూ పేర్కొన్నారు. మసీదును ధ్వంసం చేసి ఆలయాన్ని నిర్మించిన వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా మరిచిపోతుంటారని ఆయన తీవ్ర వ్యాఖ్యాలు చేశారు.

అంతేకాకుండా గాయని చిత్ర తన నిజస్వరూపాన్ని ఈ సందర్భంగా బయటపెట్టారంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో మరికొందరు నెటిజన్లు కూడా ఆమె పోస్ట్‌ చేసిన వీడియో గురించి ప్రస్తావించారు. అంతే కాకుండా అది తప్పు అంటూ పేర్కొన్నారు. ఆమె ఓ రాజకీయ పక్షం వైపు మొగ్గు చూపారంటూ తప్పుపడుతున్నారు.

ఇదిలా ఉంటే మరో గాయకుడు జి. వేణుగోపాల్‌ మాత్రం ఆమె వ్యాఖ్యలను సమర్థించారు. తన అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ, హక్కు ఆమెకు ఉన్నాయని ఆయన వెనకేసుకొచ్చారు. ఆమె మనో భావాలను కావాలని దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా ఆమె ఇలా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టడం పట్ల ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే కనుక ఆమెను ఈ విషయంలో క్షమించి విడిచిపెట్టాలని ఆయన తన సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు.

Also read: రాజీవ్‌గాంధీ హయాంలోనే రామమందిరానికి శంకుస్థాపన జరిగింది:శరద్ పవార్..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు