Anjum Khan: మా ఆయన ధోనితోనే ఉండాలి.. యంగ్ ప్లేయర్ భార్య ఎమోషనల్ పోస్ట్!

ధోనీపై యంగ్ క్రికెటర్ శివమ్ దూబె వైఫ్ అంజుమ్ ఖాన్ ప్రశంసలు కురిపించింది. 'ధోనీ ఆడే మ్యాచ్‌ అసలే మిస్ అవను. ధోనీ అంటే క్రికెట్‌.. క్రికెట్‌ అంటే ధోనీ. ఆయనను కలవాలనే ఆశ నా భర్త శివమ్‌ ద్వారా నెరవేరింది. ఆయన టీమ్‌లో శివమ్‌ ఎప్పుడూ ఉండాలని నా కోరిక' అంటూ ఎమోషనల్ అయింది.

New Update
Anjum Khan: మా ఆయన ధోనితోనే ఉండాలి.. యంగ్ ప్లేయర్ భార్య ఎమోషనల్ పోస్ట్!

IPL: టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌, చెన్నై స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్‌ ధోనీపై శివమ్‌ దూబె భార్య అంజుమ్‌ ఖాన్ (Anjum Khan) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ధోనితో తమకున్న అనుబంధం, అభిమానం గురించి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా ఇరువురి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

View this post on Instagram

A post shared by Anjum Khan (@anjum1786)

నా భర్త శివమ్‌ ద్వారా కల నెరవేరింది..
ఈ మేరకు ‘ఇండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోజుల్లో ఫస్ట్ టైమ్ ఓ న్యూస్‌ ఛానెల్‌లో ధోనీ పేరు విన్నా. ఆయన గురించి తెలియనంత వరకు నాకు క్రికెట్‌ అంటే ఇష్టం మాత్రమే ఉండేది. కానీ ధోనీ ఇంటర్వ్యూ మొత్తం చూసిన్నప్పనుంచి తెలియకుండానే క్రికెట్‌ మ్యాచ్‌లన్నీ చూస్తున్నా. ధోనీ ఆడే మ్యాచ్‌ అసలే మిస్ కానివ్వను. కష్టాల్లో ఉన్న జట్టును మహీ గెలిపిస్తాడనే ధైర్యం ఉంటుంది. ధోనీ అంటే క్రికెట్‌.. క్రికెట్‌ అంటే ధోనీ. ఆయనను కలవాలనే ఆశ నా భర్త శివమ్‌ ద్వారా నెరవేరింది. ఆయన టీమ్‌లో శివమ్‌ ఉండాలని నా కోరిక. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలి’ అంటూ తన మనసులో మాట బయటపెట్టింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: 90 రోజులు టారీఫ్ లకు బ్రేక్..అంతా ఒట్టిదే..వైట్ హౌస్

ట్రంప్ టారీఫ్ ల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు సుంకాలను ఆపేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని వైట్ హౌస్ కొట్టిపడేసింది. టారీఫ్ లను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 

New Update
us

White House

 ప్రతీకార సుంకాలను ఆపేది లేదని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైట్ హౌస్. ఏది ఏమైనా టారీఫ్ లను కొనసాగిస్తామని చెప్పారు. మా విధానంలో ఎటువంటి మార్పూ ఉండదు అన్నారు. అయితే ఏ దేశమైనా టారీఫ్ ల మీద చర్చకు వస్తే తాము సుముఖంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేయాలని ఆలోచిస్తున్నారనే వార్తలను వైట్ హౌస్ ఖండించింది. దానిపై వస్తున్న వార్తలన్నీ నకిలీవి అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. 

 

ఒక్క పోస్ట్ తో అంతా తారుమారు..

నిన్న ఎక్స్ లో వాల్టర్ బ్లూమ్ బెర్గ్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హాసెట్,  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజుల సస్పెన్షన్ గురించి ఆలోచిస్తున్నారని పోస్ట్ లు వచ్చాయి. దీంతో మార్కెట్లో గందరగోళం మొదలైంది.  ఈ ఒక్క పోస్ట్ తో స్టాక్ మార్కెట్ హెచ్ థగ్గులకు గురైంది. దీని గురించే ఈరోజు వైట్ హౌస్  మాట్లాడింది. హాసెట్ చెప్పినదాన్ని జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ట్రంప్ కు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ చర్చ అంతా బిలియనీర్ హెడ్జ్ ఫండ్ పెట్టుబడిదారుడు, ట్రంప్ మద్దతుదారుడు అయిన బిల్ అక్మాన్ ఆదివారం ట్రంప్ అసమాన సుంకాల ఏర్పాట్లను పరిష్కరించడానికి, దేశానికి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడానికి "90 రోజుల గడువు" అమలు చేయాలని సూచించిన తర్వాత చర్చ ప్రారంభమైంది.

 today-latest-news-in-telugu | usa | donald trump tariffs | white-house

Also Read: RCB VS MI: ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది

Advertisment
Advertisment
Advertisment