Crime: రూ. 600 కోసం కన్నకూతురి గొంతు కోసిన తండ్రి!

కేవలం రూ. 600 కోసం కన్న కూతురినే గొంతు కోసి చంపేశాడో కసాయి తండ్రి. ఈ ఘటనలో తల్లి కేవలం ప్రేక్షక పాత్ర వహించింది తప్ప..జరుగుతున్న దారుణ ఘటనను అడ్డుకోలేకపోయింది. ఈ దారుణ సంఘటన షాజహాన్‌పూర్‌ లోని భరద్వాజీ ప్రాంతంలో జరిగింది.

New Update
Crime: రూ. 600 కోసం కన్నకూతురి గొంతు కోసిన తండ్రి!

Crime: పితృదినోత్సవాన్ని అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటుంటే... కేవలం రూ. 600 కోసం కన్న కూతురినే గొంతు కోసి చంపేశాడో కసాయి తండ్రి. ఈ ఘటనలో తల్లి కేవలం ప్రేక్షక పాత్ర వహించింది తప్ప..జరుగుతున్న దారుణ ఘటనను అడ్డుకోలేకపోయింది. ఈ దారుణ సంఘటన షాజహాన్‌పూర్‌ లోని భరద్వాజీ ప్రాంతంలో జరిగింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు సహజంగానే నేరస్తుడని తెలిసింది. అతని మీద ఇప్పటికే 16 కేసులు నమోదు అయ్యాయి. ఆ ప్రాంతానికి చెందిన సంజయ్‌ గుప్తా, తన భార్య వందన, కుమారుడు పూర్తిలతో కలిసి నివాసం ఉంటున్నాడు. సంజయ్‌ కుమార్తె పూర్తి రెండు సంవత్సరాల క్రితం ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని గొడవలు రావడంతో పుట్టింట్లోనే బిడ్డతో నివాసం ఉంటుంది.

సంజయ్ కొడుకు పవన్ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జూన్ 13న కూతురితో పాటు తాను కూడా బంగారు ఉంగరాన్ని అమ్మేందుకు బయటకు వెళ్లినట్లు తల్లి వందన పోలీసులకు వివరించింది.

ఆ ఉంగరం అమ్మగా వచ్చిన డబ్బుతో ఇంటి సామాగ్రి కొనుక్కుని మిగిలిన డబ్బుతో ఇంటికి తిరిగి రాగా.. మిగిలిన రూ.600 కూతురిని తండ్రి సంజయ్ అడిగాడు. కానీ వాటిని ఇచ్చేందుకు పూర్తి నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన సంజయ్‌ రాత్రి అందరూ నిద్ర పోయిన తరువాత రాత్రి 12.15 గంటల ప్రాంతంలో పూర్తి మెడపై కత్తితో కోసి హత్య చేశాడు.

నిందితున్ని పోలీసులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు. నిందితుడి మీద ఇప్పటికే అక్రమ మద్యం, పిస్టల్‌ని లైసెన్స్‌ లేకుండా కలిగి ఉన్నాడనే ఆరోపణల కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Also read: రూ. 2 లక్షల రుణమాఫీ పై అలర్ట్‌.. వారికి మాత్రమే !

Advertisment
Advertisment
తాజా కథనాలు