Telangana: రేపటి నుంచే తెలంగాణలో బడులు ప్రారంభం

వేసవి సెలవులు ముగిశాయి. పిల్లల ఆటపాటలకు చెక్ పడనుంది. రేపటి నుంచి బడులు ఓపెన్ అవనున్నాయి. తెలంగాణలో రేపటి నుంచి ప్రభుత్వ, ప్రవైటు స్కూళ్ళల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.

New Update
Telangana: రేపటి నుంచే తెలంగాణలో బడులు ప్రారంభం

తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్ళు మొదలవుతున్నాయి. ఇవాల్టితో సెలవులు ముగిశాయి. ఎప్పటిలానే జూన్ 12నుంచి తరగతి గదులు ప్రారంభం అవనున్నాయి. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్కూళ్ళను పునఃప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల్ని ప్రోత్సహించేందుకు ఇప్పటికే ఇక్కడ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఇది మొదలైంది. అయితే ఆంధ్రాలో మాత్రం వేసవి సెలవులు ఒకరోజు పొడిగించారు. రేపు అక్కడ చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉన్న కారణంగా సెలవును పొడిగించారు. అక్కడ 13వ తేదీ నుంచి స్కూళ్ళు ప్రారంభం అవుతాయి.

ఇక ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ తెలిపింది. ప్రవైటు సూళ్ళల్లో ఉదయం 8 గంటలకే తరగతులు మొదలవుతాయి.అందుకే ప్రభుత్వ బడుల్లో కూడా టైమింగ్స్ మార్చామని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, డ్రాపౌట్ల సంఖ్యను తగ్గించేందుకు విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కొత్త విద్యా సంవత్సరంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కనీసం 90 శాతం విద్యార్ధుల హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశించారు. దానికోసం పేరెంట్స్ కమిటీలు, విద్యా కమిటీలు, స్థానిక స్వచ్ఛంధ సంస్థలు, ఉపాధ్యాయులను భాగస్వామ్యుల్ని చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

కల్తీ కల్లు కలకలం.. 58 మందికి తీవ్ర అస్వస్థత

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కల్తీ కల్లు తాగి మతిస్థిమితం కోల్పోవడంతో పాటు వింతగా ప్రవర్తించారు. దీంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.

New Update
Kamareddy issues

Kamareddy issues Photograph: (Kamareddy issues)

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగిన వారంతా ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ కల్తీ కల్లు వల్ల ఒక్కసారిగా మతిస్థిమితం కోల్పోయారు. వింతగా ప్రవర్తించడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

కల్తీ కల్లు తాగిన వారి పరిస్థితి విషమం..

ఈ కల్తీ కల్లు తాగిన వారిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణానికి వెళ్లి శాంపిల్స్ సేకరించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఆ కల్లు దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేయాలని అధికారులను సబ్ కలెక్టర్ వెల్లడించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిని కల్లు దుకాణాలను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కల్తీ కల్లు వల్ల ఇంకా ఎందరు ప్రాణాలు కోల్పోవాలని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వాటిని పూర్తిగా క్లోజ్ చేయాలని, ఇలాంటి వాటికి అసలు పర్మిషన్లు ఇవ్వకూడదని స్థానికులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

Advertisment
Advertisment
Advertisment