School Bus: తెలంగాణలో స్కూల్‌బస్సు బోల్తా.. ఎంత మంది విద్యార్థులకు గాయాలయ్యాయంటే..?

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ఘోర పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు. పిల్లలకు ఏమైనా జరుగుతుందేమో అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీగా ఆస్పత్రి దగ్గర చేరుకున్నారు.

New Update
School Bus: తెలంగాణలో స్కూల్‌బస్సు బోల్తా.. ఎంత మంది విద్యార్థులకు గాయాలయ్యాయంటే..?

మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జడ్చర్లలో విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సుబోల్తా పడింది. బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులు తీవ్రంగా గాయాలయ్యాయి. మౌంట్‌ బాసిల్‌ స్కూల్‌కు చెందిన బస్సు జడ్చర్ల-మహబూబ్‌నగర్‌ మార్గంలో కొత్తతండా దగ్గర అదుపుతప్పి బోల్తాపడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికులతో సహాయకచర్యలు చేపట్టారు. విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థులను మొదటగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించి.. అనంతరం SVS ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆందోళనతో ఆస్పత్రి వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకున్నారు. కొంతమంది స్కూల్ దగ్గర నుంచి విద్యార్థులందరిని ఇంటికి తీసుకెళ్తున్నారు.

లారీ బలంగా ఢీకొట్టడంతో

పోలీసుల వివరాల ప్రకారం.. స్కూల్ బస్సు బోల్తాపడి 30 మంది విద్యార్థులు గాయపడినట్లు తెలిపారు. 45 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. కొత్తతండా సమీపంలో ఉన్న మౌంట్ బాసిల్ ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన 7వ నెంబర్ గల బస్సు ప్రమాదానికి గురైదయ్యారు. ఈ క్రమంలో క్రాసింగ్ దగ్గర వెనక నుంచి లారీ బలంగా ఢీకొట్టడంతో బస్సు అదుపు తప్పి డివైడర్‌కు ఢీకొట్టిందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 44 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే 167 హైవేపై భారీగా ట్రాఫిక్ జాం అయింది.

మెరుగైన వైద్య చికిత్స అందించాలని

గాయపడిన విద్యార్థులలో కొందరి విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. స్కూల్‌ బస్సు బోల్తాపడిన విషయం తెలిసిన తల్లిదండ్రులు  పాఠశాల వద్దకు భారీ సంఖ్యలో ల్లల యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమ పిల్లలకు ఏం జరిగిందోనని ఆరా తీసే ప్రయత్నం చేసి టెన్షన్‌ పడ్డారు. ఈ క్రమంలో స్కూల్‌ యజమాన్యం స్కూల్ బస్సు రూట్ నెంబర్ తెలపకపోవడంతో  తల్లిదండ్రులు భయాందోళనకు గురైయ్యారు. అయితే ప్రమాదంపై అడిగితే.. యజమాన్యం దురుసుగా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.. జిల్లా కలెక్టర్‌ ద్వారా వివరాలు అడిగి.. పరిస్థితిపై ఆరా తీశారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు. నిత్యం యూటర్న్ అనంతరం రాంగ్ రూట్‌లో బస్సు స్కూల్‌కి వెళ్తోంది. డౌన్ ఆల్, టర్నింగ్ ఉన్న జాతీయ రహదారిపై అల వెళ్ళడం సరైంది కాదని పలు మార్లు యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెపుతున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామంటున్న పాఠశాల యాజమాన్యం తెలిపారు.

ఇది కూడా చదవండి: కొత్త స్నేహాలు ఎంతవరకు.. ఎవరిని నమ్మాలి..?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: నెలల తరబడి డబ్బు కూడబెట్టి కశ్మీర్ పర్యటన.. 9ఏళ్ల కొడుకు ముందే ప్రశాంత్ కలను కాలరాసిన ఉగ్రవాదులు!

పహల్గాం ఉగ్రదాడి ఒడిశాకు చెందిన ప్రశాంత్ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. నెలల తరబడి డబ్బు కూడబెట్టి ఫ్యామిలీతో కశ్మీర్ పర్యటన వెళ్లిన ప్రశాంత్‌ను 9ఏళ్ల కొడుకు, భార్యముందే కాల్చి చంపేశారు. అతని మరణ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

New Update

Pahalgam Attack: మంగళవారం కశ్మీర్‌లోని బైసారన్‌లో జరిగిన ఉగ్రదాడి ఒడిశా బాలాసోర్‌కు చెందిన కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. 9 ఏళ్ల కొడుకు, భార్య ముందే 41 ఏళ్ల ప్రశాంత్ సత్పతిని దారుణంగా కాల్చి చంపారు. అతని మరణ వార్త వినగానే తల్లి షాక్‌తో సృహతప్పి పడిపోగా గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక తాము రోప్‌వే నుంచి దిగుతుండగా ఉగ్రవాదులు ఆయన తలపై కాల్చి చంపారని ప్రశాత్ భార్య ప్రియదర్శిని ఆచార్య తెలిపింది. ప్రశాంత్ అక్కడికక్కడే పడిపోయాగా ఈ సంఘటన జరిగిన ఒక గంట తర్వాత సైన్యం వచ్చిందని చెప్పింది. ప్రశాంత్ మరణ వార్త గ్రామ తూర్పు ప్రాంతానికి చేరుకోగానే అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయని,  ఈ షాక్ కారణంగా అతని తల్లి ఏమీ మాట్లాడలేకపోతున్నట్లు కన్నీరు పెట్టుకున్నారు. 

నెలల తరబడి డబ్బు దాచుకుని..

ప్రశాంత్ బాలాసోర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (CIPET)లో అకౌంట్స్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. అయితే ఈ కశ్మీర్ పర్యటన కోసం అతను నెలల తరబడి డబ్బు దాచుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సెలవులు పెట్టి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి తమను తీసుకొచ్చాడని ప్రియదర్శిని తెలిపింది. బుధవారం రాత్రి మృతదేహాన్ని భువనేశ్వర్‌కు తీసుకురానుండగా.. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సూచనల మేరకు ఢిల్లీలో ఉన్న ఒడిశా రెసిడెంట్ కమిషనర్ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. గురువారం అంత్యక్రియలు జరుగనున్నాయి. దీనిలో ప్రభుత్వ ప్రతినిధులు కూడా పాల్గొంటారని, బాధిత కుటుంబాన్ని ఓదారుస్తున్నట్లు భువనేశ్వర్ ఎంపీపీ అపరాజిత సారంగి తెలిపారు. కాంగ్రెస్, హిందూ జాగరణ్ మంచ్ ఈ దాడిని ఖండించి నివాళులర్పించాయి. 

Also Read: Pahalgam Terror Attack-Tollywood: క్షమించరాని క్రూరమైన చర్య..ఉగ్రదాడిని ఖండించిన సినీ ప్రముఖులు!

మరోవైపు ఉగ్రవాదుల దాడిని అడ్డుకునేందుకు హీరోలా ముందుకొచ్చి మరణించిన హార్స్‌రైడర్ సయీద్‌ అదిల్ హుస్సేన్‌ షాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పర్యటకులపై దాడికి  పాల్పడుతుంటే అడ్డుకున్నాడు. ఉగ్రమూకల నుంచి తుపాకులు  లాగేసుకునేందుకు ప్రయత్నించి, చివరికి వీరుడిలా ప్రాణాలు విడిచాడు. ఇక హుస్సేన్ మృతిపై స్పందించిన పేరెంట్స్.. ‘పనికోసం మా కొడుకు పహల్గాం వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటలకు దాడి జరిగినట్లు తెలిసింది. మేము వెంటనే ఫోన్ చేశాం కానీ కలవలేదు. స్విచ్ఛాఫ్ వచ్చింది. సాయంత్రం 4.40 గంటల సమయంలో ఫోన్ రింగ్ అయింది కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు.  పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేయగా ఉగ్రదాడిలో మా బిడ్డకు గాయలైనట్లు చెప్పారు’ అని హుస్సేన్ తండ్రి సయ్యద్ హైదర్ షా చెప్పారు. కానీ చివరకు హుస్సేన్ మరణవార్త తెలిసి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. 

Also read : ALH Dhruv choppers : ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!

pehalgam terror attack | odisha | family | telugu-news today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు