సత్యసాయి నీటి పథకం ఉద్యోగుల అర్థనగ్న ప్రదర్శన...!

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సత్యసాయి నీటి పథకం ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత ఐదు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని చెబుతూ అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. త ఐదారు నెలలుగా వేతనాలు చెల్లించక పోవడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. వెంటనే పాత బకాయిలను చెల్లించి తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సమ్మెలోకి వెళ్లారు.

New Update
సత్యసాయి నీటి పథకం ఉద్యోగుల అర్థనగ్న ప్రదర్శన...!

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సత్యసాయి నీటి పథకం ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత ఐదు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని చెబుతూ అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. త ఐదారు నెలలుగా వేతనాలు చెల్లించక పోవడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. వెంటనే పాత బకాయిలను చెల్లించి తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సమ్మెలోకి వెళ్లారు.

దీంతో అనంతపురం జిల్లాలోని వందలాది గ్రామాలకు నీటి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. తాజాగా కళ్యాణదుర్గం సత్యసాయి నీటి పథకానికి సంబంధించిన పంపు హౌస్ ఎదుట ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తమను శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించాలని, వెంటనే తమ బకాయిలు చెల్లించకపోతే సమ్మె ఇలాగే కొనసాగిస్తూ గ్రామీణ ప్రాంతాలకు నీటిని వదలబోమని హెచ్చరించారు.

ఇది ఇలా వుంటే గత నెలలుగా తమకు బాకీ వున్న వేతనాలు చెల్లించి, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సత్యసాయి తాగునీటి పథకం కింద పనిచేస్తున్న సమారు 575 మంది కార్మికులు సమ్మె బాట పట్టారు. సత్యసాయి నీటి పథకానికి సంబంధించిన మోటార్ పంపులను కార్మికులు ఆఫ్ చేశారు. దీంతో సుమారు 1200 పైగా గ్రామాలకు తాగునీటి సమస్య ఏర్పడింది.

కార్మకుల సమ్మె విషయాన్ని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో కార్మిక నేతలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. దీంతో కార్మిక నేతలను పిలిచి అధికారులు వారితో చర్చించారు. కానీ చర్చలు విఫలం కావడంతో కార్మికులు తమ సమ్మె కొనసాగించనున్నట్టు వెల్లడించారు. తాగు నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అధికారులు ఇటీవల వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

YS Jagan : జగన్కు ఎస్‌ఐ వార్నింగ్.. ఏందీ నువ్వు ఊడదీసేది అరటితొక్క!

జగన్ చేసిన కామెంట్స్ పై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కూటమిలోని నేతలను చూసుకుని పోలీసులు రెచ్చిపోతే అధికారంలోకి వచ్చాక బట్టలూడదీసి కొడతామంటూ నిన్న జగన్ చేసిన కామెంట్స్ పై ఎస్‌ఐ సుధాకర్‌ ఓ వీడియో విడుదల చేశారు.  

New Update
jagan-si-sudhakar

jagan-si-sudhakar

ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ పై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కూటమిలోని నేతలను చూసుకుని పోలీసులు రెచ్చిపోతే అధికారంలోకి వచ్చాక బట్టలూడదీసి కొడతామంటూ నిన్న జగన్ చేసిన కామెంట్స్ పై ఎస్‌ఐ సుధాకర్‌ ఓ వీడియో విడుదల చేశారు.  ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ..  ‘జగన్‌.. పోలీసులను బట్టలూడదీసి కొడతానంటున్నారా. పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకున్నారనుకున్నారా? అని ప్రశ్నించారు.  కష్టపడి చదివి, పరుగు పందెల్లో పాసై.. వేలాదిమంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫాం ఇది అని చెప్పుకొచ్చారు.

ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదు

మీరు వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదన్నారు. తాము నిజాయతీగానే ప్రజల పక్షాన నిలబడతామన్న సుధాకర్..   నిజాయతీగానే ఉద్యోగం చేస్తామని, నిజాయతీగానే చస్తాం తప్ప.. అడ్డదారులు తొక్కమని తెలిపారు.  జగన్.. జాగ్రత్తగా మాట్లాడాలి.. జాగ్రత్తగా ఉండాలని ఎస్‌ఐ సుధాకర్‌ హెచ్చరించారు. ఇక  గతనెల మార్చిలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్ధంగానే నడుచుకున్నామని సుధాకర్ తెలిపారు.  జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వందల మంది పోలీసులతో బందోబస్తు కల్పించామని.. అయినప్పటికీ ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని సుధాకర్ ఆ వీడియోలో ఆరోపించారు.

మాజీ సీఎం జగన్ అనుచరులు..  తమ దగ్గర గన్ లు ఉన్నాయని.. ఎవరొస్తారో రండి అంటూ రెచ్చగొడుతున్నారని.. ఇలా కిందిస్థాయి ఉద్యోగులను భయపెడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు సుధాకర్..ఈ విషయంలో ఉద్యోగులకు భరోసా కల్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, హోంమంత్రి, డీజీపీలను ఆయన కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు