డ్రాగన్ వక్ర బుద్ది... ఓ వైపు చర్చలు... మరో వైపు సరిహద్దుల వెంట నిర్మాణాలు....!

చైనా వక్ర బుద్ది మరోసారి బయట పడింది. తాజాగా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని మోడీలు అనధికారికంగా భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. భారత్ కోరినందునే ఈ సమావేశం జరిగిందని చైనా చెప్పుకొచ్చింది. కానీ ఈ వాదనను భారత్ తోసి పుచ్చింది. భారత్ అలాంటి విజ్ఞప్తి చేయలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది.

author-image
By G Ramu
New Update
డ్రాగన్ వక్ర బుద్ది... ఓ వైపు చర్చలు... మరో వైపు సరిహద్దుల వెంట నిర్మాణాలు....!

చైనా వక్ర బుద్ది మరోసారి బయట పడింది. తాజాగా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని మోడీలు అనధికారికంగా భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. భారత్ కోరినందునే ఈ సమావేశం జరిగిందని చైనా చెప్పుకొచ్చింది. కానీ ఈ వాదనను భారత్ తోసి పుచ్చింది. భారత్ అలాంటి విజ్ఞప్తి చేయలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది.

ఇరు దేశాల మధ్య సమావేశం జరగాలని చైనానే ప్రతిపాదన చేసిందని పేర్కొంది. అది ప్రస్తుతం పెండింగ్ లో వుందని వెల్లడించింది. బ్రిక్స్ సమావేశాల్లో జిన్ పింగ్ తో కాసేపు ప్రధాని మోడీ మాట్లాడినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే సరిహద్దుల వద్ద శాంతి నెలకొల్పేయాల ప్రయత్నించాలని, సమస్యలు పరిష్కరం అయితేనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని జిన్ పింగ్ కు ప్రధాని మోడీ సూచించినట్టు పేర్కొన్నాయి.

ఇది ఇలావుంటే భారత్ విషయంలో చైనా ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తోందని మరోసారి తేటతెల్లం అయింది. ఓ వైపు సైనిక బలగాల ఉపసంహరణ అంటూనే సరిహద్దుల వెంట తన పని తాను చేసుకుపోతోంది. తాజాగా యూఎస్ కు చెందిన మ్యాక్సర్ సంస్థ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో చైనా మిలటరీ నిర్మాణాలను వేగవంతం చేసినట్టు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది.

వాస్తవాధీన రేఖకు 65 కిలో మీటర్ల దూరంలో చైనా సైనిక నిర్మాణాలను చేపట్టినట్టు శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. సుమారు 250 హెక్టార్ల విస్తీర్ణంలో నిఘా రాడార్లు, రోడ్లు, ఇతర నిర్మాణాలు చేపడుతున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఓ వైపు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ నిర్మాణాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మొదట్లో మంచు కురియడం మొదలైన సమయంలో ఈ నిర్మాణాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. పీఎల్ఏ, వైఎల్సీ-4, వైఎల్సీ-8 సర్వేలైన్స్ రాడార్లు ఈ శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తోంది. ఈ ప్రదేశంలో చైనీస్ మిలిటరీ వ్యూహాత్మక వినియోగానికి అవకాశం కలిగించే భూగర్బ మార్గాలు వున్నట్టు కనిపిస్తున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పశ్చిమ బెంగాల్‌లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి

వెస్ట్ బెంగాల్ సీఎంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, యూపీ సీఎం యోగి ఆథిత్య నాథ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రే రాష్ట్రంలో హింస ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమని ఆమె ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు.

New Update
Union Minister Kiren Rijiju

వక్ఫ్‌ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పశ్చిమబెంగాల్‌‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారడంపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనల పేరుతో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జినే హింసను ప్రేరేపిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమని మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. ఏప్రిల్ 12 నుంచి  బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. ఘర్షణల్లో ముగ్గురు మృతిచెందారు. మొత్తం 110 మంది నిరసనకారులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి హింసలో ఉగ్ర సంస్థల కుట్ర ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి.

Also read: Toll charges: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

మమతా బెనర్జిపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మండిపడ్డారు. వక్ఫ్‌ సవరణ చట్టానికి నిరసనగా రాష్ట్రంలో హింస చెలరేగుతుంటే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకేమి పట్టనట్టుగా ఉన్నారని ఆయన విమర్శించారు. వారం రోజులుగా ముర్షిదాబాద్‌ మంటల్లో రగులుతుంటే సీఎం మాత్రం మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. లౌకికవాదం పేరుతో రాష్ట్రంలో అల్లర్లను లేపేవారికి ఆమె పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని యోగీ అన్నారు. 

Also read: Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 వల్ల లాభాలు ఇవే..

Advertisment
Advertisment
Advertisment