సామ్ ట్రీట్మెంట్ కి ఆ స్టార్ హీరో రూ.25 కోట్లు ఇచ్చాడా? క్లారిటీ ఇచ్చేసిన సమంత!

సామ్ ట్రీట్మెంట్ కి ఓ స్టార్ హీరో ఏకంగా రూ.25 కోట్లు ఇచ్చారట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఎక్కడ చూసినా ఇదే వార్త అందరినీ షాక్ గురి చేస్తుంది. తాజాగా ఈ వార్తలపై సామ్ రియాక్ట్ అయింది. తన చికిత్స కోసం స్టార్ హీరో సాయమంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని తేల్చింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా వేదికగా తెలిపింది. 'ఎవరో మీకు తప్పు సమాచారం అందించారు. మయోసైటిస్ చికిత్సకు నాకు రూ.25 కోట్లు సహాయం చేశారా..

New Update
Samantha : సమంత ఇలా చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు..!

స్టార్ హీరోయిన్ సమంతకి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులోనూ ఆమె నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఎన్నో రకాల వార్తలు నిత్యం ట్రోల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా సమంతకి సంబంధించి మరో వార్త నెట్టింట తెగ వైరల్ గా మారింది. అందేంటంటే సామ్ ట్రీట్మెంట్ కి ఓ స్టార్ హీరో ఏకంగా రూ.25 కోట్లు ఇచ్చారట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఎక్కడ చూసినా ఇదే వార్త అందరినీ షాక్ గురి చేస్తుంది. తాజాగా ఈ వార్తలపై సామ్ రియాక్ట్ అయింది. తన చికిత్స కోసం స్టార్ హీరో సాయమంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని తేల్చింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా వేదికగా తెలిపింది.

'ఎవరో మీకు తప్పు సమాచారం అందించారు. మయోసైటిస్ చికిత్సకు నాకు రూ.25 కోట్లు సహాయం చేశారా? మీరు అంటున్న దానిలో చాలా తక్కువ మాత్రమే ప్రస్తుతం నా ట్రీట్మెంట్ కు అవుతుంది. ఇప్పటివరకూ నేను బాగానే సంపాదించుకున్నా.. నన్ను నేను బాగానే చూసుకుంటున్నా. ఇలాంటి ఫేక్ వార్తలపై ట్రోల్ చేసేముందు కాస్త బాధ్యతగా వ్యవహరించండి' అంటూ సూచించింది.

కాగా సమంతకు గత ఏడాది మయోసైటిస్ సోకింది. ఆమె 'శాకుంతలం' చిత్రం చేస్తున్నప్పుడే ఈ వ్యాధి బయటపడింది. అప్పటి నుంచి సామ్ దీనికి చికిత్స తీసుకుంటున్నారు. 2022 అక్టోబర్ నెలలో సమంత మయోసైటిస్ బారినపడిన విషయాన్ని మీడియా ద్వారా వెల్లడించారు. అయితే మయోసైటిస్ చికిత్స ఎంతో ఖర్చుతో కూడుకున్నదని అప్పటినుంచే ఎన్నో వార్తలు వచ్చాయి.

అలాగే ఇదేమీ ప్రాణాంతకం కాదు.. నేను చనిపోవడం లేదు.. అలా అని సమస్య చిన్నది కూడా కాదు.. నేను పోరాడాల్సి ఉందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది సమంత. ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే సామ్ 'ఖుషి' మూవీ చేసింది. ఇక ఖుషీ మూవీ షూటింగ్ తర్వాత ఆమె లాంగ్ గ్యాప్ ప్రకటించింది. దీనికి పూర్తిగా ట్రీట్మెంట్ పై ఫోకస్ పెట్టింది. అలాగే ఈ మధ్య తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తోంది.

ప్రస్తుతం సామ్ 'ఖుషి', 'సిటాడెల్' షూటింగ్స్ పూర్తి చేశారు. ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇది రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా.. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఇక 'సిటాడెల్' వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు