BRS-Jeevan Reddy : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్

ఆర్మూర్ లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆర్టీసీ స్థలంలో నిర్మించిన షాపింగ్ మాల్ అద్దె రూ.3 కోట్లను సాయంత్రంలోగా చెల్లించాలని స్పష్టం చేశారు. లేకుంటే మాల్ ను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.

New Update
TGSRTC : ముందు ఉంది.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సజ్జనార్ స్వీట్ వార్నింగ్!

Armur Ex MLA : బీఆర్ఎస్(BRS) నేత, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) కి ఆర్టీసీ(RTC) అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ కు సంబంధించి ఆర్టీసీ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీసీ స్థలంలో లీజుపై నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ విశ్వజిత్ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్(Vishwajit Infrastructure Pvt Ltd) సంస్థకు నోటీసులు ఇచ్చిన స్పందించడం లేదని అధికారులు వెల్లడించారు.

Jeevan Reddy

ఆర్టీసీ లీజు స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ అద్దె బకాయిలను గడువు లోగా చెల్లించనందున హైకోర్టు ఉత్తర్వులు మేరకు సీజ్ చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ చేశారు ఆర్టీసీ అధికారులు. సాయంత్రం వరకు డెడ్‌లైన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. సాయంత్రంలోగా రూ.3.14 కోట్ల బకాయిలు చెల్లించకుంటే కాంప్లెక్స్ సీజ్‌ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. షాపింగ్ మాల్ లో ఉన్న అద్దె దారులు ఆర్టీసీ మైక్ అనౌన్స్మెంట్ గమనించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సాయంత్రం జీవన్ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ ను ఆర్టీసీ అధికారులు సీజ్ చేసే అవకాశం ఉంది.
publive-image

ఈ ఘటనపై జీవన్ రెడ్డి ఇంకా రియాక్ట్ కాలేదు. ఆయన ఎలా స్పందిస్తారన్న అంశం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది.

Also Read : టీడీపీ నేత ఇంట్లో భారీగా సొమ్ము స్వాధీనం.. అధికారి లెక్కలపై అనుమానాలు..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hrithik Roshan Krrish 4: ఇదో కొత్త ప్రపంచం, మళ్లీ స్కూల్‌కు వెళ్లినట్లు అనిపిస్తోంది: హృతిక్ రోషన్

హృతిక్ రోషన్ తన డైరెక్షన్ డెబ్యూట్‌గా 'క్రిష్ 4'ను తెరకెక్కించబోతున్నారు. దర్శకుడిగా మారడం తనకు కొత్తగా, సవాళ్లతో కూడినదిగా అనిపిస్తుందని చెప్పారు. హృతిక్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో అనేక మంది బాలీవుడ్ స్టార్‌లు ఉన్నారు.

New Update
Hrithik Roshan Krrish 4

Hrithik Roshan Krrish 4

Hrithik Roshan Krrish 4: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, ఇప్పటివరకు హీరోగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆయన ఇప్పుడు మరో కొత్త ఛాలెంజ్‌కి రెడీ అవుతున్నారు. అవును, హృతిక్ రోషన్ తొలిసారి దర్శకుడిగా మారనున్నట్టు ఇప్పటికే అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కబోయే తొలి చిత్రం ‘క్రిష్ 4’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో హృతిక్ ఈ ప్రయాణంపై తన భావాలను షేర్ చేసుకున్నారు. “దర్శకుడిగా మారడం నాకు సంతోషకరం అయినప్పటికీ, కొంత భయం కూడా కలుగుతోంది. ఇది పూర్తిగా కొత్త ప్రపంచం. మళ్లీ స్కూల్‌కు వెళ్లినట్లు అనిపిస్తోంది. ఒక దర్శకుడిగా అనేక విషయాల్లో నైపుణ్యం అవసరం, భారీగా పరిశోధనలు చేయాలి. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో, 'ఇది ఎందుకు ఎంచుకున్నానా?' అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. అయినా, వాటన్నింటికీ సిద్ధంగా ఉన్నాను,” అంటూ తన డైరెక్షన్ జర్నీపై హృతిక్ ఓపెన్ అయ్యారు.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

హృతిక్‌ త్రిపాత్రాభినయంలో..!

‘క్రిష్ 4’ అనగానే ఫ్యాన్స్‌లో ఎనలేని క్రేజ్ మొదలైంది. అందుకు కారణం, హృతిక్‌ ఇందులో త్రిపాత్రాభినయంలో కనిపించనున్నారని వినిపిస్తున్న వార్తలు. హీరోగా మాత్రమే కాకుండా, విలన్ పాత్రలో కూడా కనిపించబోతున్నారని టాక్. ఇక ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ టాప్ నటీనటులు కూడా భాగం కానున్నారు. ప్రీతి జింటా, ప్రియాంక చోప్రా, వివేక్ ఒబెరాయ్, రేఖ లాంటి ప్రముఖులు ఇందులో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే గ్లామర్ క్వీన్ నోరా ఫతేహి కూడా ఓ కీలక పాత్రలో నటించనుందని సమాచారం.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

ఈ విధంగా క్రిష్ 4 సినిమాతో హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా హృతిక్ కొత్త ఛాప్టర్ మొదలుపెట్టబోతున్నారు. ఆయన తీసుకున్న ఈ క్రియేటివ్ రిస్క్ బాలీవుడ్‌లో మరో సెన్సేషన్‌ను సృష్టించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు