TSRTC: రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్?.. క్లారిటీ ఇచ్చిన ఎండీ సజ్జనార్!

జనవరి 5 నుంచి సమ్మెకు దిగుతామని అద్దె బస్సుల యాజమాన్య సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై స్పందించిన ఆర్జీసీ ఎండీ సజ్జనార్.. ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె లేదని స్పష్టం చేశారు. అద్దెబస్సుల యజమానుల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు.

New Update
TSRTC: రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్?.. క్లారిటీ ఇచ్చిన ఎండీ సజ్జనార్!

TSRTC: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్టీసీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ టికెట్ అమల్లోకి తెచ్చినప్పటినుంచి ఏదో ఒక ఇష్యూ, సంచలనాలతో ఆర్టీసీ ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూనే ఉంది. అంతేకాదు ఫ్రీ టికెట్ ఎఫెక్ట్ కారణంగా తెలంగాణ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ (Road Transport Corporation) అధికారులు తమ సంస్థలో పలు సవరణలు చేపట్టారు. ఇటీవలే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (MD Sajjanar) టీ 24 టికెట్లను పూర్తిగా క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు అద్దె బస్సుల వ్యవహారం చర్చనీయాంశమైంది. జనవరి 5 నుంచి సమ్మెకు దిగుతామని అద్దె బస్సుల యాజమాన్య సంఘం ఇప్పటికే ప్రకటించగా దీనిపై సజ్జనార్ స్పందించారు.

ఈ మేరకు ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె లేదని సజ్జనార్ స్పష్టం చేశారు. బస్ భవన్ (Bus bhavan) లో ఈ రోజు జరిపిన చర్చలు సఫల మయ్యాయని, అద్దెబస్సుల యజమానుల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. దీని కోసం ఒక కమిటీని వేస్తాం. జనవరి 5 నుంచి యధావిధిగా అద్దెబస్సులు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి సమ్మె ఉండదన్నారు. అలాగే తెలంగాణలో ప్రస్తుతం 2700 అద్దెబస్సులు రన్ చేస్తున్నమని, సంక్రాంతికి కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుందన్న ఆయన.. పండగ సందర్భంగా స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి : Kishan reddy: బీఆర్ఎస్ కు ఎంపీ ఎన్నికల్లో ఓటేస్తే చెత్త కుప్పలో వేసినట్లే.. అదో ఔట్ డేటెడ్ పార్టీ: కిషన్ రెడ్డి

ఇక అద్దె బస్సుల యాజమాన్య సంఘం అధ్యక్షుడు మధుకర్ రెడ్డి (Madhukar reddy)మాట్లాడుతూ.. 5 సమస్యలను సజ్జనార్ కు విన్నవించాం. తమ సమస్యలను జనవరి 10 లోపు పరిష్కరిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు. దీంతో జనవరి 5న తలపెట్టిన సమ్మె విరమిస్తున్నాం. మహాలక్ష్మి స్కీమ్ తో ప్రయాణికుల రద్దీ పెరిగిందని దీంతో బస్సులు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అద్దె బస్సుల యజమానులు, బస్సులు పాడై రద్దీ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఈ సమ్మెకు దిగబోతున్నట్లు ప్రకటించినప్పటికీ సజ్జనార్ ఇందుకు సంబంధించిన పూర్తి బాధ్యతలు తీసుకుని, సమస్యను పరిష్కరిస్తామని చెప్పినట్లు మధుకర్ తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Whatsapp: వాట్సాప్‌ సేవల్లో అంతరాయం..!

మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్‌ యాప్‌ వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వాట్సాప్‌ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్‌ లు అప్‌లోడ్‌ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

New Update
whatsapp

whatsapp Photograph: (whatsapp)

Whatsapp: మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్‌ యాప్‌ వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. భారత్ లోని యూజర్లు యాప్‌ ను ఉపయోగించడంలో అవాంతరం ఎదుర్కొంటున్నారు. వాట్సాప్‌ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్‌ లు అప్‌లోడ్‌ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్ ప్రకారం..81 శాతం మంది మెసేజులు పంపడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు తెలిసింద.వాట్సాప్‌ దీని పై అధికారికంగా స్పందించలేదు. మెటాకే చెందిన ఫేస్‌బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ సేవల్లోనూ అంతరాయం ఎదుర్కొంటున్నట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. ఉదయం యూపీఐ సేవల్లో ..సాయంత్రం వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడడం పై యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?

ఉదయం యూపీఐ సేవలు..

యూపీఐ సేవలు మరోసారి ఆగిపోయాయి. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే సర్వర్లు అన్ని కూడా డౌన్ అయ్యాయి. అసలు పేమెంట్స్ కావడం లేదని సోషల్ మీడియాలో కస్టమర్లు ట్వీట్స్ చేస్తున్నారు. పేమెంట్స్ కాకపోవడంతో హోటల్స్, షాపులు, మాల్స్, టీ షాపులు, టిఫిన్ సెంటర్లు, పండ్ల మార్కెట్లు ఇలా అన్ని చోట్ల కూడా కస్టమర్లు, వ్యాపారులు గందరగోళానికి గురవుతున్నారు. చేతిలో డబ్బులు వాడటం చాలా మంది ఎప్పుడో మరిచిపోయారు. ఇప్పుడు సడెన్‌గా యూపీఐ పనిచేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వారంలో యూపీఐ పేమెంట్స్ ఆగిపోవడం ఇది రెండోసారి. 

Also Read: Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు

Also Read: Sridhar Babu : హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివే...మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన

business | meta | Facebook Meta | instagram | facebook-instagram-down | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment