Crime News: కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి..! అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాఘవ రాజు పురం వద్ద ఓ లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో, అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసుపై దర్యాప్తు చేపట్టారు. By Jyoshna Sappogula 12 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Crime News: ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో ఎలా వస్తుందో ఎవరం చెప్పలేము. ఏదో ఒక ప్రాంతంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా, అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రైల్వే కోడూరు మండలం రాఘవ రాజు పురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో, అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. Also Read: నయనతార కాపురంలో చిచ్చురేపిన వేణుస్వామి.. విడాకులు తప్పవంటూ వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసుపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగం, మద్యం తాగి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ఇలా రకరకాల కారణాలతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. Also Read: చింతమనేని వద్దు – ఎవరైనా ముద్దు.. తేల్చి చెబుతున్న టిడిపి-జనసైనికులు ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్ర గాయాలతో బ్రతికి జీవితాన్ని నరకప్రాయంగా అనుభవిస్తున్నారు. కారణాలు ఎవైనా చనిపోయిన కుటుంబాలు మాత్రం రోడ్డున పడుతున్నాయి. రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్ అధికారులు ఎన్నో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పట్టికి ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. #kadapa #ap-crime సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి